BigTV English

Tirumala : మళ్లీ చిరుత కలకలం.. శ్రీవారిమెట్టు మార్గంలో సంచారం..

Tirumala :  మళ్లీ చిరుత కలకలం.. శ్రీవారిమెట్టు మార్గంలో సంచారం..


Tirumala : తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. చంద్రగిరి మండలంలోని శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతను సోమవారం సాయంత్రం భక్తులు గుర్తించారు. వేగంగా రోడ్డు దాటుతున్న చిరుతను పులివెందులకు చెందిన భక్తులు చూశారు.దీంతో తీవ్ర భయాందోళనకు గురవయ్యారు. ఆ తర్వాత తేరుకుని టీటీడీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

చిరుత సంచారంపై టీటీడీ అధికారుల అప్రమత్తమయ్యారు. కాలినడక భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్‌ హౌస్‌ వద్ద భక్తులను నిలిపివేస్తున్నారు. అక్కడ నుంచి గుంపులుగా పంపుతున్నారు. చిరుత సంచారంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు.


కొద్ది రోజుల క్రితం చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఆ అంతకుముందు ఓ బాలుడిపైనా దాడి చేసింది. ఆ రెండు ఘటనల తర్వాత టీటీడీ అధికారులు ఫారెస్ట్‌ సిబ్బంది సహాయంతో ఆపరేషన్‌ చిరుతను చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 6 చిరుతలను బంధించారు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు భక్తులు. అయితే మరోసారి చిరుత సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

.

.

.

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×