E-Paper
Advertisement

Vizag : స్కూల్‌ పిల్లల ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆటో మూడు పల్టీలు..

Vizag : స్కూల్‌ పిల్లల ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆటో మూడు పల్టీలు..

Vizag : విశాఖలోని సంగం శరత్‌ థియేటర్‌ కూడలి వద్ద పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. బుధవారం ఉదయం రైల్వే స్టేషన్‌ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్నఆటోను.. వెనుకే వస్తున్న లారీ అదుపుతప్పి ఢీ కొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా 3 పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు, స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మధురవాడ-నగరం పాలెం రోడ్డులో జరిగిన మరో ప్రమాదంలో.. ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి. మధురవాడ నుంచి నగరంపాలెం వైపుగా విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది విద్యార్థులుండగా .. అందరూ స్వల్పంగా గాయపడ్డారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×