E-Paper
Advertisement

Vizag : స్కూల్‌ పిల్లల ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆటో మూడు పల్టీలు..

Vizag : స్కూల్‌ పిల్లల ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆటో మూడు పల్టీలు..
Advertisement

Vizag : విశాఖలోని సంగం శరత్‌ థియేటర్‌ కూడలి వద్ద పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. బుధవారం ఉదయం రైల్వే స్టేషన్‌ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్నఆటోను.. వెనుకే వస్తున్న లారీ అదుపుతప్పి ఢీ కొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా 3 పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు, స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Advertisement

మధురవాడ-నగరం పాలెం రోడ్డులో జరిగిన మరో ప్రమాదంలో.. ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి. మధురవాడ నుంచి నగరంపాలెం వైపుగా విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది విద్యార్థులుండగా .. అందరూ స్వల్పంగా గాయపడ్డారు.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×