E-Paper
Advertisement

Drinking Water Problem: 75 ఏళ్ల స్వతంత్ర భారతం.. గుక్కెడు నీళ్ల కోసం ఇంకా తప్పని పాట్లు

Drinking Water Problem: 75 ఏళ్ల స్వతంత్ర భారతం.. గుక్కెడు నీళ్ల కోసం ఇంకా తప్పని పాట్లు
Advertisement

Drinking Water Problem: స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తోంది. భారత్‌ చంద్రయాన్‌ వంటి మైలురాయిని అందుకుని.. సూర్యుడిపై ప్రయోగాలు కూడా చేస్తుంది. ఇంతజరుగుతున్నా.. కొన్ని చోట్ల మాత్రం సమస్యలు అలాగే ఉన్నాయి. కనీస అవసరాలు కూడా అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వాటిలో మంచినీటి సమస్య ఒకటి.

ఏపీలోని సత్యసాయి జిల్లా మడకశిరలో ఎండాకాలం రాకుండానే నీటి సమస్య తలెత్తింది. గుక్కెడు నీటి కోసం ఐదేసి కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి. అన్ని సంక్షేమ పథకాలనూ ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు.. ఇలాంటి విషయాలను మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నాయి. కనీస అవసరాలను తీర్చలేని ప్రభుత్వాలు తమకెందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు మహిళలు.

Advertisement

చాలా కాలంగా అధికారులు, నేతలు చుట్టూ తిరిగి.. సమస్య పరిష్కారం కాకపోవటంతో ఆందోళన చేపట్టారు. పోరాటం ద్వారానే సాధించుకోవాలని నిర్ణయించుకుని.. ఎంపీడీవో కార్యాలయం వద్ద పత్తికుంట గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మేడలు, మిద్దెలు తమకు అవసరం లేదని.. గుక్కెడు నీరు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

గ్రామస్థుల పోరాటానికి కేవీపీఎస్ మద్దతు తెలిపింది. అనంతరం ఎంపీడీఓకు బాధితులు వినతిపత్రం అందించారు. ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకూ తమ గోడు విన్నవించుకున్నారు. తమ ప్రాంతంలో చాలాకాలంగా సమస్య ఉన్నా.. ఎవరూ పట్టించుకోవటం లేదని మహిళలు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర ఉన్న బోరు బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నామని.. చాలా ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు.

Advertisement

కొన్నిచోట్ల రైతులు.. తమ బోరుబావులకు రావద్దని చెబుతున్నారని.. వాళ్లను బ్రతిమాలుకుని కొన్ని బిందెలు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Tags

Related News

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?-రోజా

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

Big Stories

Advertisement
×