E-Paper
Advertisement

Taneti Vanitha : హోంమంత్రి ఇలాఖాలో యువకుడి మృతి.. పరిస్థితి ఉద్రిక్తం

Taneti Vanitha : హోంమంత్రి ఇలాఖాలో యువకుడి మృతి.. పరిస్థితి ఉద్రిక్తం
Advertisement
Taneti Vanitha news

Taneti Vanitha news(Breaking news in Andhra Pradesh) :

దళిత యువకుడు బొంతు మహేంద్ర ఆత్మహత్యతో తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫ్లెక్సీ వివాదంలో పోలీసుల విచారణతో మనస్తాపానికి గురైన మహేంద్ర అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన హోంమంత్రి తానేటి వనిత ఇలాఖాలో జరిగింది. అయితే,.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వారికి పరిహారం ఇచ్చేందుకు వెళ్లిన వనితను స్థానికులు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఘోరావ్‌ చేశారు. మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్భంధించారని చెప్పినా పట్టించుకోలేదని.. ఒకవేళ స్పందించి ఉంటే మహేంద్ర ప్రాణాలు పోయేవి కాదని హోమంత్రిపై మండిపడ్డారు. ఆమెను రోడ్డుపైనే నిలిపేశారు.

ఈ క్రమంలో పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్థానికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసరడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉద్రిక్తత కారణంగా తానేటి వనిత అక్కడే ఆగిపోగా.. మంత్రి మేరుగు నాగార్జున, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు వెళ్లి బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

ఈ నెల 6వ తేదీన కొవ్వూరు మండలం దొమ్మేరులో గడప గడపకు కార్యక్రమం సందర్భంగా వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఫ్లెక్సీలో పార్టీ నేతలు నాగరాజు, సతీష్‌ ముఖాలను కత్తిరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఈ నెల 13న దొమ్మేరుకు వెళ్లిన ఎస్‌ఐ భూషణం మహేంద్రను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. దీంతో అవమానంగా భావించిన మహేంద్ర పురుగుల మందు తాగాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు .

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×