E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీలో పర్యటించిన మారిషస్ అధ్యక్షుడు.. సీఎం చంద్రబాబు మర్యాద పూర్వక భేటీ

CM Chandrababu: ఏపీలో పర్యటించిన మారిషస్ అధ్యక్షుడు.. సీఎం చంద్రబాబు మర్యాద పూర్వక భేటీ
Advertisement

CM Chandrababu: మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గుంటూరు జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సీఎం చంద్రబాబు… ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు.

గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా అక్కడ ఉన్నారు.

సంక్రాంతి కంటే ముందే వచ్చిన పండుగ- సీఎం చంద్రబాబు

Advertisement

మాతృ భాషను మర్చిపోతే మనల్ని మనం కోల్పోయినట్లే అని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొన్న సీఎం.. మాట్లాడుతూ.. మాతృభాష మన మూలాలకు సంకేతమని అన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండుగ తెలుగు మహా సభలు అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌ పేరును ఈ వేదికకు పెట్టడం సంతోషదాయం అన్నారు. దేశంలోని ఆరు ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటని గుర్తుచేశారు.

Also Read:   భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కనెక్టివిటీ- సీఎం చంద్రబాబు

Advertisement

హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారన్నారు. కొత్త సాంకేతికతో తెలుగులో మాట్లాడితే అదే భాషలో సమాధానమిస్తాయన్నారు. తెలుగు టైప్‌ చేయడంరాని వాళ్లు ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుందన్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×