E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీలో పర్యటించిన మారిషస్ అధ్యక్షుడు.. సీఎం చంద్రబాబు మర్యాద పూర్వక భేటీ

CM Chandrababu: ఏపీలో పర్యటించిన మారిషస్ అధ్యక్షుడు.. సీఎం చంద్రబాబు మర్యాద పూర్వక భేటీ
Advertisement

CM Chandrababu: మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గుంటూరు జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సీఎం చంద్రబాబు… ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు.

గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా అక్కడ ఉన్నారు.

సంక్రాంతి కంటే ముందే వచ్చిన పండుగ- సీఎం చంద్రబాబు

Advertisement

మాతృ భాషను మర్చిపోతే మనల్ని మనం కోల్పోయినట్లే అని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొన్న సీఎం.. మాట్లాడుతూ.. మాతృభాష మన మూలాలకు సంకేతమని అన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండుగ తెలుగు మహా సభలు అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌ పేరును ఈ వేదికకు పెట్టడం సంతోషదాయం అన్నారు. దేశంలోని ఆరు ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటని గుర్తుచేశారు.

Also Read:   భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కనెక్టివిటీ- సీఎం చంద్రబాబు

Advertisement

హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారన్నారు. కొత్త సాంకేతికతో తెలుగులో మాట్లాడితే అదే భాషలో సమాధానమిస్తాయన్నారు. తెలుగు టైప్‌ చేయడంరాని వాళ్లు ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుందన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×