E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీలో పర్యటించిన మారిషస్ అధ్యక్షుడు.. సీఎం చంద్రబాబు మర్యాద పూర్వక భేటీ

CM Chandrababu: ఏపీలో పర్యటించిన మారిషస్ అధ్యక్షుడు.. సీఎం చంద్రబాబు మర్యాద పూర్వక భేటీ

CM Chandrababu: మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గుంటూరు జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సీఎం చంద్రబాబు… ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు.

గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా అక్కడ ఉన్నారు.

సంక్రాంతి కంటే ముందే వచ్చిన పండుగ- సీఎం చంద్రబాబు

మాతృ భాషను మర్చిపోతే మనల్ని మనం కోల్పోయినట్లే అని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొన్న సీఎం.. మాట్లాడుతూ.. మాతృభాష మన మూలాలకు సంకేతమని అన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండుగ తెలుగు మహా సభలు అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌ పేరును ఈ వేదికకు పెట్టడం సంతోషదాయం అన్నారు. దేశంలోని ఆరు ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటని గుర్తుచేశారు.

Also Read:   భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కనెక్టివిటీ- సీఎం చంద్రబాబు

హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారన్నారు. కొత్త సాంకేతికతో తెలుగులో మాట్లాడితే అదే భాషలో సమాధానమిస్తాయన్నారు. తెలుగు టైప్‌ చేయడంరాని వాళ్లు ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుందన్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×