BigTV English

Lokesh on Jagan: డిప్యూటీ సీఎం కంటే జగన్‌కు ఎక్కువ.. మంత్రి లోకేష్ క్లారిటీ

Lokesh on Jagan: డిప్యూటీ సీఎం కంటే జగన్‌కు ఎక్కువ.. మంత్రి లోకేష్ క్లారిటీ

Lokesh on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఎందుకు భయపడుతున్నారు? ఎవరి నుంచైనా ఆయన ముప్పు పొంచి ఉందా? తనకు సెక్యూరిటీ కల్పించలేదని పదే పదే  ఎందుకంటున్నారు? కావాలనే అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న మాదిరిగానే సెక్యూరిటీ ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అసలు ప్రజాప్రతినిధులకు భద్రత విషయంలో ఏం జరుగుతోంది?


జగన్ భద్రత గురించి

జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు కొత్త కొత్త అంశాలు తెరపైకి తెస్తున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కేవలం రెండు అంశాలు మాత్రమే తెరపైకి తెచ్చారు. మొన్నటివరకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రెండోది జగన్ భద్రత. దీనికి  గురించి రకరకాలుగా ఆ పార్టీ నేతలు ప్రస్తావించడం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేతలు ఆరోపించినట్టుగా జగన్‌కు ప్రభుత్వం భద్రత తగ్గించిందా? దీనిపై మంత్రి లోకేష్ ఏమన్నారు?


ఏపీ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు మొదలయ్యాయి. శాసన సభ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యా యి. తొలుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రతిపక్ష హోదాపై కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ నేతలు, పత్రిక, టీవీ ఛానెళ్లు ఆరోపించినట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంటే వైసీపీ అధినేత జగన్‌కే ఎక్కువ భద్రత ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరి భద్రత ఉంటే, జగన్‌కు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత చేయకుండా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు మంత్రి లోకేష్. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు గవర్నర్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని, ఉభయ సభలను ఉద్దేశించి ఆయన స్పీచ్‌ను డస్టర్బ్ చేయడం దారుణమన్నారు. గవర్నర్ స్పీచ్ సమయంలో ఏనాడూ తాము పోడియం వద్దకు రాలేదన్నారు.

ALSO READ: జగన్‌ను క్షమిస్తున్నా.. ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కీలక ప్రకటన

తాను అసెంబ్లీలో కొత్త సభ్యునని, రూల్స్ తెలుసుకుంటున్నానని తెలిపారు. గతంలో స్పీకర్‌గా పని చేసిన సభ్యులు ప్రస్తుతం సభలో ఉన్నారని గుర్తు చేశారు. జగన్ ప్రతిపక్ష హోదాపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారాయన.

టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్నారని, ఐదుగుర్ని లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉందని జగన్ చెప్పారని గుర్తు చేశారు మంత్రి లోకేష్. దొంగ పేపర్, ఛానెల్ వినియోగించుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారని, ప్రజా తీర్పుని గౌరవించి ప్రజలపై పోరాడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.

గడిచిన తొమ్మిది నెలల్లో హోదా, భద్రత గురించి మాత్రమే ప్రస్తావించింది వైసీపీ. ప్రజా సమస్యలను మాత్రం గాలి కొదిలేసింది. ఆ విషయం ఆ పార్టీ నేతలకు సైతం తెలుసు. చివరకు ఆ పార్టీ సభ్యులు సైతం సభలో మాట్లాడాలని ఉన్నా, అధినేత ఆదేశాలతో సైలంట్ అయిపోతున్నారు. రేపటి రోజున వైసీపీ మళ్లీ తెరపైకి ఎలాంటి విషయాన్ని తెస్తుందో చూడాలి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×