E-Paper
Advertisement

YS Sharmila: దమ్ముంటే అడుగు పెట్టు.. ఆపై మాట్లాడు.. ఇచ్చిపడేసిన షర్మిల

YS Sharmila: దమ్ముంటే అడుగు పెట్టు.. ఆపై మాట్లాడు.. ఇచ్చిపడేసిన షర్మిల
Advertisement

YS Sharmila: ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య జగడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంటి పోరు ఇంతింత కాదనేట్టు.. అన్న చెల్లెలి మధ్య డైలాగ్ వార నడుస్తూనే ఉంటుంది. సందు దొరికినప్పుడల్లా.. తన స్టైల్లో వాయించేస్తున్నారు. కుదిరితే ట్వీటు.. వీలైతే ప్రెస్ మీటు.. వేదిక ఏదైనా సరే.. అన్న జగన్ మీద.. అంతెత్తున్న లేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న సోషల్ మీడియా పోస్టుల అరెస్టులపై.. అన్న జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.

సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ద్రుష్పచారాలకు జగనే కారణమని షర్మిల ఫైర్ అయ్యారు. తనతో పాటు విజయమ్మ, చెల్లెలు సునీతపై.. నీచంగా పోస్ట్‌లు పెట్టించింది జగనేనని సంచలన ఆరోపణలు చేశారు. తమపై సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడమే కాదు.. అక్రమ సంబంధాలు కూడా అంటగట్టారని అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డిలపై మరో కేసు నమోదు..

అలానే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకూ, మాకూ తేడా లేదని కౌంటరిచ్చారు. ఓట్లేసిన 38శాతం ప్రజలు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెబుతారని షర్మిల ధ్వజమెత్తారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఆయన స్వయంకృతాపరాధమేనన్నారు షర్మిల. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లే ఇచ్చారన్నారు.

Advertisement

అసెంబ్లీకి వెళ్లకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న షర్మిల వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ స్పందించారు. తన సోదరి గురించి ఇక్కడ మాట్లాడవద్దని మీడియాతో అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వమే లేదని.. 1.7 శాతం మాత్రమే ఓటు బ్యాంకు ఉందన్నారు.

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×