E-Paper
Advertisement

Rayadurgam : వైసీపీ టిక్కెట్ మెట్టు గోవిందరెడ్డికే దక్కుతుందా? కాపు రామచంద్రారెడ్డి దారెటు?

Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో రేసు గుర్రాలు ఎవరు? వైసీపీకి గుడ్ బై చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు? వైసీపీ టిక్కెట్ మెట్టు గోవిందరెడ్డికి దక్కుతుందా? అసలు పోటీలో నిలిచేదెవరు? ఇప్పుడు రాయదుర్గంలో ఎక్కడ చూసిన ఇదే చర్చ నడుస్తోంది.

Rayadurgam : వైసీపీ టిక్కెట్ మెట్టు గోవిందరెడ్డికే దక్కుతుందా? కాపు రామచంద్రారెడ్డి దారెటు?
Advertisement

Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో రేసు గుర్రాలు ఎవరు? వైసీపీకి గుడ్ బై చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు? వైసీపీ టిక్కెట్ మెట్టు గోవిందరెడ్డికి దక్కుతుందా? అసలు పోటీలో నిలిచేదెవరు? ఇప్పుడు రాయదుర్గంలో ఎక్కడ చూసిన ఇదే చర్చ నడుస్తోంది.

ఇటీవలే వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇతర పార్టీలకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈసారి ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని స్పష్టంచేశారు. ఈ నియోజకవర్గంలో 2009, 2019 ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసుల చేతిలో ఓటమి చవిచూశారు.

Advertisement

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిని తానేనంటూ మెట్టు గోవింద రెడ్డి ప్రకటించుకున్నారు. నిజానికి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మరో నాయకుడి కోసం వైసీపీ నాయకత్వం సెర్చింగ్ మొదలుపెట్టింది. ఇంతలో తానే అభ్యర్థిని అంటూ మెట్టు గోవిందరెడ్డి పల్లెల్లో ప్రచారం మొదలుపెట్టేశారు. ఇంతకీ అధిష్టానం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుదో ఆసక్తిగా మారింది.

మెట్టు గోవిందరెడ్డి 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాపు రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మెట్టు గోవిందరెడ్డి ఇప్పుడు టిక్కెట్ తనకే దక్కుతుందనే నమ్మకంతో ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీ టిక్కెట్ కాలవ శ్రీనివాసులు దక్కడం ఖాయం. మరి కాపు రామచంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు? కాంగ్రెస్ లో చేరి షర్మిల వెంట నడుస్తారా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

Big Stories

Advertisement
×