E-Paper
Advertisement

Modi in Tirumala : శ్రీవారి సేవలో ప్రధాని.. రెండు నియోజకవర్గాల్లో ప్రచారం

Modi in Tirumala : శ్రీవారి సేవలో ప్రధాని.. రెండు నియోజకవర్గాల్లో ప్రచారం
Advertisement
Modi in Tirumala

Modi in Tirumala(Andhra news updates):

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని.. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వాదాలు ఇచ్చారు. రంగనాయకుల మండపంలో మోదీకి వేదాశీర్వచనం చేశారు.

స్వామివారిని దర్శించుకున్న అనంతరం.. టీటీడీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటం, 2024 క్యాలెండర్, డైరీలను టీటీడీ అధికారులు మోదీకి అందజేశారు. కాగా.. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమల గిరులపై భద్రతను కట్టుదిట్టం చేశారు. 2 వేలమంది పోలీసులతో బందోబస్త్ నిర్వహించారు. మోదీ స్టే చేసిన అతిథి గృహాలను ఎన్ఎస్ జీ టీమ్స్ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Advertisement

తిరుమల పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు మహబూబాబాద్, కరీంనగర్ లో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొని, సాయంత్రం హైదరాబాద్ రోడ్ షో లో పాల్గొననున్నారు.

.

Advertisement

.

.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×