E-Paper
Advertisement

Modi : మోదీ విశాఖ టూర్ షెడ్యూల్ ఖరారు.. ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తారో తెలుసా?

Modi : మోదీ విశాఖ టూర్ షెడ్యూల్ ఖరారు.. ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తారో తెలుసా?
Advertisement

Modi : ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ టూర్ లో మోదీ 14 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించే అవకాశం ఉంది. రూ.10, 842 కోట్లతో చేపట్టిన, చేపట్టబోతున్న 8 ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాలకు పీఎంవో నుంచి అనుమతి లభించింది. రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రాజెక్టుల కార్యక్రమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. నవంబర్ 11న మోదీ విశాఖకు వస్తారు. అక్కడి నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకుని ఐఎన్‌ఎస్‌ చోళలో మోదీ రాత్రి బస చేస్తారు. నవంబర్ 12న ఉదయం ఏయూ గ్రౌండ్స్‌కు చేరుకుని.. అక్కడి నుంచే భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు.

14 ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఇందులో రైల్వే శాఖకు సంబంధించి ప్రాజెక్టులు 2, ఫిషరీస్‌ ప్రాజెక్టు ఒకటి, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ ప్రాజెక్టులు 3, పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మినిస్ట్రీకి సంబంధించిన 2 ప్రాజెక్టులున్నాయి. ప్రధానమంత్రి హోదాలో మోదీ మూడోసారి విశాఖకు వస్తున్నారు. 2016లో భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొన్నారు. అప్పుడు తొలిసారి విశాఖలో పర్యటించారు. 2019 ఎన్నికల సమయంలో ఆ ఏడాది మార్చిలో రైల్వే గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ప్రధాని మూడోసారి విశాఖకు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏయూ మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్కడి నుంచే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×