E-Paper
Advertisement

Modi Vishaka Tour : ఏపీ అభివృద్ధికి మోదీ భరోసా..

Modi Vishaka Tour : ఏపీ అభివృద్ధికి మోదీ భరోసా..

Modi Vishaka Tour : విశాఖలో ప్రధాని మోదీ బహిరంగసభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ భారీ సభ జరుగుతోంది. సుమారు రూ.10వేల 742 కోట్ల ప్రాజెక్టులకు వర్చువల్‌ గా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ.

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీతోపాటు, గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీకి శాలువా కప్పి రాముడి చిత్రాన్ని బహూకరించారు సీఎం జగన్. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మొదట ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. తెలుగులో నమస్కారం అంటూ ప్రసంగం మొదలు పెట్టారు కేంద్ర మంత్రి.

కేంద్ర మంత్రి తరువాత ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఏం పిల్లడో వెళ్దం వస్తవా అంటూ ఉత్తరాంధ్ర ప్రజలు ఈ సభకు తరలివచ్చారన్నారు సీఎం జగన్. కేంద్రం, మోదీ, బీజేపీతో మాకున్న అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతం అన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వారు వేరే ఉద్దేశ్యం లేదన్నారు. 8ఏళ్లుగా దెబ్బతిన్న రాష్ట్రం ఇంకా కోలుకోలేదర్నారు. రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ విజ్ఞప్తులను పరిశీలించాలన్నారు జగన్.

ప్రధాని మోదీ శంకుష్థాపన చేసిన ప్రాజెక్టు వివరాలు ఇవే..

► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు

► రూ. 3,778 కోట్లతో రాయిపూర్- విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే

► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం

► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు

► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన

► రూ. 211 కోట్లతో నిర్మించిన నరసన్నపేట -పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం

► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్‌జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×