E-Paper
Advertisement

Nadendla Manohar: తాడేపల్లి- తెనాలి దూరమెంత..? హెలీకాప్టర్ లో ప్రయాణమా..? సీఎంపై మనోహర్ సెటైర్లు..

Nadendla Manohar: తాడేపల్లి- తెనాలి దూరమెంత..? హెలీకాప్టర్ లో ప్రయాణమా..? సీఎంపై మనోహర్ సెటైర్లు..
Advertisement

Nadendla Manohar : ఏపీ సీఎం జగన్ తెనాలిలో రైతు భరోసా నిధులు విడుదల చేసే కార్యక్రమానికి వెళ్లిన విధానంపై జనసేన విమర్శలు గుప్పిస్తోంది. సీఎం నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి కేవలం 28 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మాత్రం దూరం కూడా సీఎం జగన్ కారులో ప్రయాణించలేరా అని ప్రశ్నించారు. హెలీకాప్టర్ లో వెళ్లడమేంటని నిలదీశారు.

రోడ్లు గుంతలు పడి పాడైపోవడం వల్లే సీఎం జగన్ హెలీకాప్టర్ లో వెళ్లారా అని మనోహర్ ప్రశ్నించారు. కేవలం 28 కిలోమీటర్ల దూరానికి కూడా సీఎం హెలీకాప్టర్ లో వెళ్లడంపై జనం నవ్వుకుంటున్నారని సెటర్లు వేశారు. ప్రజాధనం సీఎం హెలీకాప్టర్ ప్రయాణాలతో వృథా అవుతోందని మండిపడ్డారు. ఆ డబ్బుతో రాష్ట్రంలో రోడ్లు మరమ్మత్తులు చేయవచ్చని అన్నారు. ప్రజలను గతుకుల రోడ్ల పాల్జేసి తాను మాత్రం దర్జాగా హెలీకాప్టర్లలో ప్రయాణం చేస్తున్నారని సీఎం జగన్ పై నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

Advertisement

మరోవైపు సీఎం జగన్ తెనాలి పర్యటన సమయంలో జనసేన కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేయడాన్ని మనోహర్ ఖండించారు. అధికార పార్టీ నాయకులకు ఎందుకంత అభద్రతా భావమని ప్రశ్నించారు. ఇలాంటి అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. సీఎం వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోందని నిలదీశారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా సీఎంకు భయమని విమర్శించారు. సీఎం పర్యటనల వేళ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తున్నారని మనోహర్ మండిపడ్డారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×