E-Paper
Advertisement

Nara Bhuvaneswari : నిజం గెలవాలి యాత్ర.. మృతుల కుటుంబాలకు భువనేశ్వరి ఓదార్పు..

Nara Bhuvaneswari : నిజం గెలవాలి యాత్ర.. మృతుల కుటుంబాలకు భువనేశ్వరి ఓదార్పు..
Advertisement
AP latest news

Nara Bhuvaneswari news(AP latest news):

చంద్రబాబు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో మనస్థాపం చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు , అభిమానులు చనిపోయారు. బాధిత కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించి వారికి భరోసా ఇస్తున్నారు. ఆర్థిక చేయూత కూడా ఇస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా జి. సిగాడం మండలం దవళపేటకు చెందిన టీడీపీ కార్యకర్త కంచరాస అసిరి నాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని తాజాగా భువనేశ్వరి ఓదార్చారు. మృతుడి భార్య అరుణ కుమారికి రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ తరపున కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. భువనేశ్వరి చేసిన యాత్రలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎమ్మెల్సీ అనురాధ, నేతలు కిమిడి నాగార్జున, రాంమల్లిక్‌ నాయుడు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లాలో కూడా నారా భువనేశ్వరి పర్యటించారు. భామిని మండలం బిల్లుమడ గ్రామంలో చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక ఇటీవలే పార్టీ కార్యకర్త విశ్వనాథం మృతి చెందాడు. విశ్వనాథం కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. విశ్వనాథ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ తరుపున ఆమె బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు.

Advertisement

నారా భువనేశ్వరి అక్టోబర్ నెలలోనే నిజం గెలవాలి పేరిట యాత్రను చేపట్టారు. నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత నారా భువనేశ్వరి యాత్ర ప్రారంభించారు. భువనేశ్వరి విజయనగరం జిల్లాలో నిజం గెలవాలి యాత్ర కొనసాగుతున్న సమయంలోనే చంద్రబాబుకు బెయిల్ రావడంతో యాత్రను నిలిపివేశారు. మళ్లీ బుధవారం యాత్రను పున: ప్రారంభించారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×