BigTV English
Advertisement

Band Aid Politics : బ్యాండెయిడ్ రాజకీయం.. అన్నకు సలహా.. కోడికత్తి కమలహాసన్ అంటూ లోకేశ్ ట్వీట్

Band Aid Politics : బ్యాండెయిడ్ రాజకీయం.. అన్నకు సలహా.. కోడికత్తి కమలహాసన్ అంటూ లోకేశ్ ట్వీట్

Band Aid Politics in AP : ఏపీలో రాజకీయం ఇప్పుడు సీఎం జగన్ తలకు ఉన్న బ్యాండెయిడ్ చుట్టూ తిరుగుతోంది. ఈ నెల 13న జగన్ తలకు రాయి తగలడంతో దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వైద్యులు చికిత్స చేసి రెండు కుట్లు వేసి బ్యాండెయిడ్ వేశారు. అప్పటి నుంచి జగన్ ఎక్కడికెళ్లినా.. బ్యాండెయిడ్ తోనే వెళ్తున్నారు. దీంతో బ్యాండెయిడ్ పై చర్చ మొదలైంది. దెబ్బతగిలి 13 రోజులైనా ఇంకా తగ్గలేదా ? చిన్న దెబ్బకు ఇంకా బ్యాండెయిడ్ వేయాల్సి అవసరం లేదు అని కొందరు అంటున్నారు.


తాజాగా దీనిపై వివేకా కుమార్తె, జగన్ సోదరి డాక్టర్ సునీత స్పందించారు. ఒక వైద్యురాలిగా అన్నకు బ్యాండెయిడ్ పై సలహా ఇచ్చారామె. ఇన్నిరోజులు బ్యాండెయిడ్ ఉంచితే అది సెప్టిక్ అవుతుందని, వెంటనే దానిని తీసివేయాలని సూచించారు. గాయానికి గాలి తగిలితేనే త్వరగా మానుతుందని వైద్యురాలిగా చెబుతున్నానన్నారు. అయితే.. ప్రతిపక్షాలు జగన్ బ్యాండెయిడ్ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు చేస్తుండగా.. సునీత నిజంగానే సలహా ఇచ్చిందా లేక అన్నపై సెటైర్ వేసిందా అన్న చర్చ జరుగుతోంది.

Also Read : రేపే వైసీపీ మేనిఫెస్టో.. నవరత్నాలకు మించి ?


ఇదిలా ఉంటే.. సునీత ఇచ్చిన సలహా వీడియోను నారా లోకేష్ X లో షేర్ చేస్తూ.. జగన్ పై సెటైర్లు వేశారు. కోడికత్తి కమలహాసన్ ఆ బ్యాండేజ్ ను ఎలక్షన్ అయ్యాకే తీస్తాడని, ఇదే తన ఛాలెంజ్ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా సెటైర్లు పేలుస్తున్నారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×