BigTV English
Advertisement

YSRCP Manifesto : రేపే వైసీపీ మేనిఫెస్టో.. నవరత్నాలకు మించి ?

YSRCP Manifesto : రేపే వైసీపీ మేనిఫెస్టో.. నవరత్నాలకు మించి ?

YSRCP Manifesto for 2024 Elections(Political news in AP): రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ.. అధికార పార్టీని గద్దె దించాలని కూటమి పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ.. ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. నిన్నటితో నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నేటి నుంచి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది.


కాగా.. అధికార వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ కు ముహూర్తం ఫిక్సయింది. రేపు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫస్టో విడుదల చేస్తారని వైసీపీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేనిఫెస్టోలో.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు.. మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాలను పొందుపరుస్తారని సమాచారం. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యమిస్తుందో కూడా ఈ మేనిఫెస్టోలోనే చెప్పనుంది అధిష్టానం. ముఖ్యంగా రైతులు, యువతకు పెద్దపీఠ వేసినట్లు సమాచారం. చివరి నిమిషంలో మేనిఫెస్టోలో మార్పులు, చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది.

Also Read : బాణం ఎక్కుపెట్టిన షర్మిల, జగన్‌ పార్టీకి ఓటేస్తే.. మూడు రాజధానులెక్కడ?


అలాగే నవరత్నాలతో పాటు మరికొన్ని ఆకర్షితమైన పథకాలను మేనిఫెస్టోలో చేరుస్తారని సమాచారం. ఈ మేనిఫెస్టో నవరత్నాలకు మించి ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ 28 నుంచి సీఎం జగన్.. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రతిరోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం యాత్రలతో వైసీపీ నేతల్లో కొత్త జోష్ వచ్చింది.

28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న.. చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు, 30న కొండెపి, మైదుకూరు, పీలేరు, మే1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.

Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×