Dhulipalla Narendra Daughter Marriage: గుంటూరులో జరిగిన టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్ల వివాహ వేడుక రాజకీయ ప్రముఖుల కలయికతో సందడిగా మారింది. శ్రీ కన్వెన్షన్లో నిర్వహించిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. పెళ్లి వేడుకకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అనంతరం నూతన వధూవరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్లు ప్రత్యేకంగా ఆశీర్వదించి.. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకలో ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులను దీవించారు. రెండు రాష్ట్రాల కీలక నేతలు ఒకే వేదికపై కనిపించడంతో ఈ వివాహ వేడుక రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Read Also: Iran Blocks Pakistan Vessel: హర్మూజ్ వద్ద పాకిస్తాన్ నౌకను ఆపేసిన ఇరాన్.. ఇక దాయాదికి చుక్కలే!