BigTV English

Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. విచారణకు హాజరైన నారా లోకేష్

Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. విచారణకు హాజరైన నారా లోకేష్

Nara Lokesh : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ టీడీపీ నేత నారా లోకేష్ ను విచారిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతోంది. నారా లోకేష్ సీఐడీ విచారణ నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో తాడేపల్లిలోని SIT కార్యాలయం వద్ద ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు దశల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు, సిట్‌ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి.


ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేష్ ను A-14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసింది. లోకేష్‌ను CRPC లోని సెక్షన్ 41A క్రింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఏపీ హైకోర్ట్‌కు చెప్పింది. ఈ మేరకు ఈ నెల 4న తొలుత లోకేష్‌ ను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు పంపింది. ఈ నోటీసులో హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని కోరింది. ఈ నిబంధనలను నారా లోకేష్ ఏపీ హైకోర్ట్‌లో సవాల్‌ చేయగా.. వాదనల అనంతరం బుక్స్ కోసం లోకేష్‌పై ఒత్తిడి చేయవద్దని సీఐడీని ఆదేశింస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×