E-Paper
Advertisement

Nara Lokesh: జగన్ వస్తానంటే టికెట్ నేనే కొంటా.. టీ20 వరల్డ్ కప్ మ్యాచుపై లోకేశ్ సెటైర్లు..

Nara Lokesh: జగన్ వస్తానంటే టికెట్ నేనే కొంటా.. టీ20 వరల్డ్ కప్ మ్యాచుపై లోకేశ్ సెటైర్లు..
Advertisement

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేశ్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై.. ఆ పార్టీ నేతలపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో వైకాపాకు చెందిన సాక్షి మీడియా.. భారతి సిమెంట్స్ సంస్థలు ప్రభుత్వ నిర్ణయాల వల్ల సుమారు 1000 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందాయని లోకేశ్ ఆరోపించారు. కానీ తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం హెరిటేజ్ సంస్థపై బురద చల్లడం తగదని హితవు పలికారు.

తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై స్పందిస్తూ లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్కెట్‌లో ప్రస్తుతం కిలో నెయ్యి ధర రూ. 1000 పైనే ఉందని.. అటువంటిది కేవలం రూ. 360కే ఎవరైనా నెయ్యి సరఫరా చేస్తున్నారంటే అది కచ్చితంగా కల్తీయే అవుతుందని పేర్కొన్నారు. ఇంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి దొరకడం అసాధ్యమన్నది సామాన్యుడికి కూడా తెలిసిన విషయమని చెప్పారు. ఇందాపూర్ డెయిరీ అనేది హెరిటేజ్ సంస్థకు ‘కో కంపెనీ’ అంటూ బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అసలు వ్యాపార రంగంలో ‘కో కంపెనీ’ అనే పదమే ఉండదన్న కనీస అవగాహన కూడా బొత్సకు లేదా అని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం కక్ష సాధింపుతోనే హెరిటేజ్‌పై సెబీకి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.

Advertisement

క్రికెట్ మ్యాచ్‌లపై జగన్ చేసిన వ్యాఖ్యలకు లోకేశ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరితే మ్యాచ్ చూడటానికి తాను తప్పనిసరిగా స్టేడియానికి వెళ్తానని స్పష్టం చేశారు. ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి కూడా మ్యాచ్ చూడాలనుకుంటే.. ఆయన కోసం తాను స్వయంగా టికెట్ తీసుకుంటానని సెటైర్ వేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని.. కానీ క్రీడలను కూడా రాజకీయ కోణంలో చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు.

బడ్జెట్‌పై శాసనమండలిలో వైకాపా సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును లోకేశ్ తప్పుపట్టారు. బడ్జెట్‌పై చర్చ కావాలని ఇప్పుడు కోరుతున్న సభ్యులు.. గత నాలుగు రోజులుగా సభను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కావాలనే గందరగోళం సృష్టించడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చర్చించడం కంటే సభా కాలాన్ని వృథా చేయడమే విపక్షం పనిగా పెట్టుకుందని విమర్శించారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తోందని ఆయన పునరుద్ఘాటించారు.

Advertisement

Read Also: Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×