BigTV English
Advertisement

Nara Lokesh Padayatra: యువగళం @200 డేస్.. ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర సాగిందంటే?

Nara Lokesh Padayatra: యువగళం @200 డేస్.. ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర సాగిందంటే?
Nara Lokesh padayatra update

Nara Lokesh padayatra update(AP political news):

టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందుకు కదులుతున్నారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులకు చేరింది. గురువారం ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో టీడీపీ నేతలు యాపిల్ మాలతో లోకేశ్‌కు స్వాగతం పలికారు. తనయుడికి ప్రోత్సాహం అందిస్తూ తల్లి భువనేశ్వరి పాదయాత్రలో పాల్గొన్నారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు యాత్రలో సందడి చేశారు.


జనవరి 27న యువగళం యాత్రను లోకేశ్ ప్రారంభించారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాలను చుట్టేశారు. ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం , గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కిలోమీటర్లు లోకేశ్ నడిచారు.

తనయుడి పాదయాత్రపై తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. యువత గళం నుంచి ప్రజల గొంతుకగా యువగళం మారిందన్నారు. పాదయాత్ర 200వ రోజుకు చేరుకోవడంతో తనయుడికి అభినందనలు చెప్పారు. యువగళం బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన మంచి పనిని కొనసాగించాలని కోరారు.


యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు 3 కిలోమీటర్లు సంఘీభావ పాదయాత్రలు చేపట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ యాత్రలో పాల్గొన్నారు. టీడీపీ మేనిఫేస్టోలో పొందుపరిచిన హామీల ప్లకార్డులను ప్రదర్శించారు.

Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×