E-Paper
Advertisement

Nara Lokesh: అర్థమైందా రాజా.. ఆ వైసీపీ నేతలపై లోకేష్ పంచ్‌లు, పాపం ఏమైపోతారో!

Nara Lokesh: అర్థమైందా రాజా.. ఆ వైసీపీ నేతలపై లోకేష్ పంచ్‌లు, పాపం ఏమైపోతారో!
Advertisement

టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో నారా లోకేష్ వైసీపీ నేతలపై పంచ్ లు విసిరారు. అయితే ఆయన ఎవరి పేరు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఆయన మాటలు వింటే మాత్రం లోకేష్ టార్గెట్ ఎవరనేది ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్లినా అందరూ రెడ్ బుక్, రెడ్ బుక్ అంటున్నారుని, అసలు రెడ్ బుక్ గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు లోకేష్. “రెడ్ బుక్ పేరు చెప్పగానే కొంతమందికి గుండెపోటు వస్తుంది. కొంతమంది బాత్ రూం లో జారిపడి చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. అర్దం అయ్యిందా రాజా.” అంటూ పరోక్షంగా కొడాలి నాని, పెద్దిరెడ్డికి జరిగిన సంఘటనలను ప్రస్తావించారు.

గుండెపోటు..
ఇటీవల కొడాలి నానికి గుండెపోటు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ బుక్ లో నెక్స్ట్ ఆయన పేరే ఉందని, అందుకే ఆయన గుండెపోటు డ్రామా ఆడుతున్నారంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు. అయితే వైసీపీ మాత్రం ఆయన అనారోగ్యంపై రాజకీయమేంటని బదులిచ్చింది. ఆయనకు గుండెపోటు రాలేదని, కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరారని వివరణ ఇచ్చింది. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్రూమ్ లో జారి పడటం వల్ల చేతికి కట్టుకట్టారు. ఆ కట్టుతోనే ఆయన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయన కూడా లిస్ట్ లో ఉన్నారని, అందుకే అనారోగ్యం అని సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ టీడీపీ నేతలంటున్నారు. ఈ రెండు సంఘటనలను పరోక్షంగా లోకేష్ ప్రస్తావించడంతో ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన కార్యకర్తలు ఈలలు వేసి గోల చేశారు. లోకేష్ పంచ్ డైలాగులతో సభా ప్రాంగణంలో కేరింతలు కొట్టారు కార్యకర్తలు.

Advertisement

గల్లీ – ఢిల్లీ
మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు – ఢిల్లీ పాలిటిక్స్ తెలుసని చెప్పారు లోకేష్. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినాకూడా ఎప్పుడూ దాన్ని స్వార్ద రాజకీయ ప్రయోజనాలకు వాడుకోలేదని వివరించారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పారు. అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేయడంలో టీడీపీ కృషి ఉందని, బాలయోగి గారిని లోక్ సకు మొదటి దళిత స్పీకర్ ని చేసింది కూడా తమ పార్టీయేనని, అంబేద్కర్‌ కి భారతరత్న రావడంలో కూడా టీడీపీ కీలకపాత్ర పోషించిందన్నారు.


జెండా పీకేస్తారట..
తెలుగు దేశం జెండా పీకేస్తామని కొంతమంది వచ్చారని, అలాంటివారిప్పుడు అడ్రెస్ లేకుండా పోయారని అన్నారు లోకేష్. 2019 వరకు మనం చూసిన రాజకీయం వేరని, 2019 నుండి 2024 వరకు మనం చూసిన రాజకీయం వేరు అని అన్నారాయన. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న గత ఐదేళ్ల కాలంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను ఎదుర్కొన్నామని చెప్పారు. దేవాలయంగా భావించే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు వెన్నుచూపకుండా ఎదురునిలబడ్డామన్నారు. .పార్టీ అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడామని గుర్తు చేశారు.క్లెమోర్ మైన్ల కే భయపడని బ్లడ్ మనది అని, అలాంటిది మనం కామెడీ పీసులకు భయపడతామా? అని ప్రశ్నించారు లోకేష్.

Advertisement

మాజీ సీఎం జగన్ పై కూడా పరోక్షంగా సెటైర్లు పేల్చారు లోకేష్. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం అని సెటైర్లు వేసిన వారికి.. ప్రతిపక్ష హోదాయే లేకుండా ఇంటికి పంపించామన్నారు. గత ఎన్నికల్లో ప్యాలెస్ లు బద్దలు కొట్టామన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ స్ట్రైక్ రేట్ 94 శాతం అని చెప్పారు. 58 శాతం ఓట్ షేర్ తో 8 ఉమ్మడి జిల్లాలను క్లీన్ స్వీప్ చేశామన్నారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం ఓట్ షేర్ సాధించామని చెప్పారు లోకేష్.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×