విశాఖపట్నంలో ఐటీ రంగ విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ప్రతినిధులు నగరంలో ఏర్పాటు చేయనున్న కార్యాలయానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ భవిష్యత్లో దేశంలోని ప్రముఖ ఐటీ హబ్గా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రేపు ఉదయం 11:30 గంటలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. అంతకుముందు ఉదయం 9 గంటలకు ఐటీ మంత్రి నారా లోకేష్ మొత్తం ఏడు ఐటీ కంపెనీలకు శంకుస్థాపనలు చేయనున్నారు. కాగ్నిజెంట్ శంకుస్థాపన అనంతరం.. సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై ప్రాజెక్టు వివరాలు, భవిష్యత్ పెట్టుబడులపై చర్చించనున్నారు.
అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 వరకు విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో సీఎం పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించనున్నారు. విశాఖకు గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు రావడం వలన నగర అభివృద్ధి ఊహించని స్థాయిలో పెరుగుతుందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఐటీ రంగ ప్రవేశంతో వేలాది ఉద్యోగావకాశాలు, పెట్టుబడులు విశాఖలోకి రానున్నాయని తెలిపారు.
ALSO READ: BigTV Exclusive: ఓటుకు 10 వేలు పంచుతూ అడ్డంగా దొరికిపోయి.. ఎలా పారిపోయాడో చూస్తే