E-Paper
Advertisement

Nara Lokesh : వడ్డెర వర్గంతో లోకేష్ భేటీ.. పదవులిస్తామని హామీ..

Nara Lokesh : వడ్డెర వర్గంతో లోకేష్ భేటీ.. పదవులిస్తామని హామీ..
Advertisement

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. టీడీపీ యువత ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. పేదల సమస్యలను వింటున్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీ వర్గాలపై లోకేశ్ ప్రత్యేక శ్రద్ధపెట్టారు. బీసీల్లోని వివిధ సామాజికవర్గాల ప్రజలను కలుస్తున్నారు.

నాలుగో రోజు కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లె నుంచి ప్రారంభమై పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దారి పొడవునా ప్రజలతో లోకేశ్‌ మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. లోకేశ్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు విద్యార్థులు, యువత పోటీపడ్డారు. వి.కోట మండంలోని చెక్‌పోస్టు కూడలిలో భారీ గజమాలతో టీడీపీ శ్రేణులు లోకేశ్ కు స్వాగతం పలికాయి. చెల్దిగానిపల్లె నుంచి పలమనేరు నియోజకవర్గంలోకి వెళ్లే మార్గంలో కొంత ప్రాంతం కర్ణాటక పరిధిలోకి ఉంటుంది. ఆ సమయంలో లోకేష్ కు కర్నాటక పోలీసులు భద్రత కల్పించారు. సోమవారం రాత్రి కృష్ణాపురం టోల్‌గేట్‌ సమీపంలో లోకేశ్‌ బస చేయనున్నారు.

Advertisement

నాలుగోరోజు యువగళం పాదయాత్రలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారితో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ సామాజిక వర్గం కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మళ్లీ అధికారంలోకి రాగానే అండగా నిలుస్తామని వడ్డెర సామాజిక వర్గానికి భరోసా ఇచ్చారు. వడ్డెరలక రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా ప్రాధాన్యత గల పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ వర్గానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్న వారికి టీడీపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. 3 పూటల భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. మొత్తం 4 రోజులపాటు లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఈ యువనేత 4 వేల కిలోమీటర్లు నడవనున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×