E-Paper
Advertisement

Nara Lokesh : వడ్డెర వర్గంతో లోకేష్ భేటీ.. పదవులిస్తామని హామీ..

Nara Lokesh : వడ్డెర వర్గంతో లోకేష్ భేటీ.. పదవులిస్తామని హామీ..
Advertisement

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. టీడీపీ యువత ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. పేదల సమస్యలను వింటున్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీ వర్గాలపై లోకేశ్ ప్రత్యేక శ్రద్ధపెట్టారు. బీసీల్లోని వివిధ సామాజికవర్గాల ప్రజలను కలుస్తున్నారు.

నాలుగో రోజు కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లె నుంచి ప్రారంభమై పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దారి పొడవునా ప్రజలతో లోకేశ్‌ మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. లోకేశ్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు విద్యార్థులు, యువత పోటీపడ్డారు. వి.కోట మండంలోని చెక్‌పోస్టు కూడలిలో భారీ గజమాలతో టీడీపీ శ్రేణులు లోకేశ్ కు స్వాగతం పలికాయి. చెల్దిగానిపల్లె నుంచి పలమనేరు నియోజకవర్గంలోకి వెళ్లే మార్గంలో కొంత ప్రాంతం కర్ణాటక పరిధిలోకి ఉంటుంది. ఆ సమయంలో లోకేష్ కు కర్నాటక పోలీసులు భద్రత కల్పించారు. సోమవారం రాత్రి కృష్ణాపురం టోల్‌గేట్‌ సమీపంలో లోకేశ్‌ బస చేయనున్నారు.

Advertisement

నాలుగోరోజు యువగళం పాదయాత్రలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారితో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ సామాజిక వర్గం కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మళ్లీ అధికారంలోకి రాగానే అండగా నిలుస్తామని వడ్డెర సామాజిక వర్గానికి భరోసా ఇచ్చారు. వడ్డెరలక రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా ప్రాధాన్యత గల పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ వర్గానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్న వారికి టీడీపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. 3 పూటల భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. మొత్తం 4 రోజులపాటు లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఈ యువనేత 4 వేల కిలోమీటర్లు నడవనున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×