E-Paper
Advertisement

Elephant Attack: మన్యం జిల్లా రైతులను పరుగులు పెట్టించిన ఏనుగులు.. ఒక్కసారే పదుల సంఖ్యలో..

Elephant Attack: మన్యం జిల్లా రైతులను పరుగులు పెట్టించిన ఏనుగులు.. ఒక్కసారే పదుల సంఖ్యలో..
Advertisement

Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న గజరాజులు..  తాజాగా శివన్నపేట, మాదలంగి గ్రామాల్లోని పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. దీంతో పంటలను తొక్కి ధ్వంసం చేయడంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.

ఏడాది పొడవునా కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో ఏనుగుల దాడికి గురవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని.. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

ఏనుగుల సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులను అప్రమత్తం చేస్తూ..  పొలాల వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. టపాసులు పేలుస్తూ, డప్పు వాయిద్యాల సహాయంతో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఏనుగులు గ్రామాల సమీపంలోనే తలదాచుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.

ALSO READ: Vikarabad District: తాగిన మత్తులో డీసీఎం డ్రైవర్ బీభత్సం.. తృటిలో తప్పించుకున్న చిన్నారి, వీడియో వైరల్

Advertisement

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×