E-Paper
Advertisement

Elephant Attack: మన్యం జిల్లా రైతులను పరుగులు పెట్టించిన ఏనుగులు.. ఒక్కసారే పదుల సంఖ్యలో..

Elephant Attack: మన్యం జిల్లా రైతులను పరుగులు పెట్టించిన ఏనుగులు.. ఒక్కసారే పదుల సంఖ్యలో..

Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న గజరాజులు..  తాజాగా శివన్నపేట, మాదలంగి గ్రామాల్లోని పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. దీంతో పంటలను తొక్కి ధ్వంసం చేయడంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.

ఏడాది పొడవునా కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో ఏనుగుల దాడికి గురవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని.. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఏనుగుల సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులను అప్రమత్తం చేస్తూ..  పొలాల వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. టపాసులు పేలుస్తూ, డప్పు వాయిద్యాల సహాయంతో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఏనుగులు గ్రామాల సమీపంలోనే తలదాచుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.

ALSO READ: Vikarabad District: తాగిన మత్తులో డీసీఎం డ్రైవర్ బీభత్సం.. తృటిలో తప్పించుకున్న చిన్నారి, వీడియో వైరల్

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×