BigTV English

Pawan Kalyan on AP Govt: సైనికుడికి ఏపీలో రక్షణ లేదా..? ప్రభుత్వంపై పవన్ ఫైర్..

Pawan Kalyan on AP Govt: సైనికుడికి ఏపీలో రక్షణ లేదా..?  ప్రభుత్వంపై పవన్ ఫైర్..
Pawan Kalyan latest news

Pawan Kalyan latest news(AP political news):

విశాఖ జిల్లాలో మాజీ సైనికుడు మోపాడ ఆదినారాయణపై జరిగిన దాడిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. సైనికుడిగా దేశ రక్షణ కోసం సేవలు అందించిన ఆదినారాయణ తన గ్రామంపై బాధ్యతతో ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి ప్రయత్నిస్తే వైసీపీ నేతలు హత్యాయత్నానికి తెగబడటంపై మండిపడ్డారు. భారత్ ను శత్రుదేశాల నుంచి కాపాడిన సైనికుడు స్థానిక గూండాల నుంచి ముప్పును ఎదుర్కొంటున్నారన్నారు.


విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రైతులపాలెంకు చెందిన ఆదినారాయణపై వైసీపీ సర్పంచి అనుచరులు దాడి చేస్తే పోలీసులు స్పందించలేదని పవన్ మండిపడ్డారు. నిందితులపై హత్యాయత్నానికి సెక్షన్లు పెట్టకుండా కేవలం దాడిగా కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెవెన్యూ రికార్డులు మారుస్తున్నారని జిల్లా అధికారులకు ఆదినారాయణ ఫిర్యాదు చేసిన విషయాన్ని జనసేనాని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగిందన్నారు. భూ కబ్జాదారులు బరితెగిస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ప్రభుత్వమే సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. విలాసవంతమైన గృహాలు నిర్మించుకుంటోందని విమర్శించారు. ప్రజా ప్రతినిధులు ఆస్తులు కొల్లగొడుతుంటే వారి బాటలోనే అనుచరులు కబ్జాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని.. యథా పాలకుడు తథా అనుచరులు అన్న చందంగా వైసీపీ పాలన ఉందని పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేశారు.


మాజీ సైనికుడు ఆదినారాయణపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని జనసేనాని డిమాండ్ చేశారు. మాజీ సైనికుడికే ఏపీలో రక్షణ కల్పించలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. గతేడాది తిరుపతిలో జనవాణి నిర్వహిస్తే ప్రసాద్ అనే సైనికుడు తన భూమిని వైసీపీ వాళ్లు కబ్జా చేసి వేధిస్తున్నారని తన దృష్టికి తీసుకొచ్చారని పవన్ గుర్తు చేశారు. ఏపీలో సైనికులు, మాజీ సైనికులను ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఈ ఘటనలే నిదర్శనమన్నారు. విశాఖ ఘటనను కేంద్రీయ సైనిక్ బోర్డు దృష్టికి తీసుకెళ్తామన్నారు. మాజీ సైనికుడు ఆదినారాయణ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని పవన్‌ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×