E-Paper
Advertisement

Pawan Vs Udhayanidhi stalin: సనాతన ధర్మం.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై పవన్ పంచ్, ఎందుకంటే?

Pawan Vs Udhayanidhi stalin: సనాతన ధర్మం.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై పవన్ పంచ్, ఎందుకంటే?
Advertisement

Pawan Vs Udhayanidhi stalin: తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్ వెనుక ఏం జరిగింది? తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిస్టాలిన్‌పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? సనాతన ధర్మం సభకు తిరుపతినే ఎందుకు ఎంచు కున్నారు? దీనివెనుక బీజేపీ పెద్దల స్కెచ్ ఉందా? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి.

తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతుందా? మరో రెండేళ్లలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పవన్‌కల్యాణ్.. స్టాలిన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారనే ప్రచారం బలంగా సాగుతోంది.

Advertisement

తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది వైరస్ లాంటిదని, ఈ మహమ్మారిని నిర్మూలించాలంటూ ఆ మధ్య తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, ఉదయనిధి వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. పరిస్థితి గమనించిన పవన్ కల్యాణ్, ఆ విషయాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని, దాన్ని నిర్మూలించాలంటే వారే తుడిచిపెట్టుకుని పోతారన్నారు పవన్ కల్యాణ్. ఈ మాటను తిరుపతి బాలాజీ సాక్షిగా చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఆ మాటలను తమిళం, ఇంగ్లీష్‌లో ప్రస్తావించారు.

Advertisement

ALSO READ: 7 పాయింట్లతో ‘వారాహి డిక్లరేషన్’.. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక చట్టం, కీలక అంశాల ప్రస్తావన

సనాతన ధర్మానికి భంగం కలిగితే బయటకు వచ్చి పోరాటం చేస్తానని, అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తానని కుండబద్దలు కొట్టేశారు. ఒకవిధంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు పవన్ కల్యాణ్ హెచ్చరిక ఇచ్చారన్నది కొందరి నేతల మాట. సనాతన ధర్మంపై దాడులు న్యాయస్థానాలు కాపాడడం బాధాకరమని జగన్ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు.

పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి. సనాతన ధర్మంపై తిరుపతిలో మాట్లాడినంత మాత్రాన సరిపోదని, ఇదే విషయాన్ని తమిళనాడులో సభ పెట్టి మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సనాతనధర్మం గురించి తప్పుగా మాట్లాడితే తాటతీస్తానని అక్కడ చెప్పాలన్నది నెటిజన్స్ వ్యాఖ్య.

మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ హిందూవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకులు లేరని బీజేపీ హైకమాండ్ ఆలోచన. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ రూపంలో ప్లాన్ వేసిన్నట్లు రాజకీయ విశ్లేషకుల మాట. మరి పవన్ సనాతన ధర్మం కామెంట్స్ తమిళ తంబీలతోపాటు అక్కడి రాజకీయ పార్టీలేమంటాయో వెయిట్ అండ్ సీ.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×