Pawan Kalyan: నీట్ ఆందోళనలపై ఎపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పదించారు. విద్యార్థుల ఆందోళనను దారి మళ్లించారని ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఆందోళనను విభజన శక్తులు హైజాక్ చేశాయని అన్నారు. ప్రజాస్వామ్య నిరసనను హింసాత్మకంగా మార్చాలని చూశారని, దేశ వ్యతిరేక నినాదాలకు చోటు లేదని పవన కళ్యాన్ తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య నిరసనకు నా మద్దతు ఉంటుందని స్పష్ట్రం చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నేను వ్యతిరేకం అని అన్నారు. నేషన్ ఫస్ట్ భావనతో దేశ సమగ్రతను కాపాడాలని, విద్యార్థి సమస్యలపై కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో ఉందని ఫైర్ అయ్యారు. దేశంలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకులతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని తెలిపారు. పార్టమెంటు గేటు ముందు నిరసనలు తెలుపుతూ విధ్యార్ధలతో పాటు కలిసి ధర్నాలో పాల్గోని కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ విధ్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.
Also Read: NEET Leak: బిఎఫ్ ఆర్డర్లు, బిర్యానీలు.. ఢిల్లీ నిరసనలు రాంచందర్ రావు షాకింగ్ కామెంట్స్!
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ జరుపుతున్న ఆందోళనలపై ఢిల్లీ హైకోర్టు స్పందించిన విషయం తెలసిందే.. దీనిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.కే.ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరపు న్యాయవాది బరున్ కుమార్ సిన్హా ప్రస్తావించారు. విద్యార్థి ఉద్యమం పేరుతో సాగుతున్న నిరసనల వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పిటిషన్ పై తక్షణమే విచారణ జరిపి తగు ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.
Also read: రాహుల్ చెప్పాడని డ్యాన్స్ చేయొద్దు.. సీఎం రేవంత్రెడ్డికి రాజా సింగ్ కౌంటర్!