E-Paper
Advertisement

రాహుల్ చెప్పాడని డ్యాన్స్ చేయొద్దు.. సీఎం రేవంత్‌రెడ్డికి రాజా సింగ్ కౌంటర్!

రాహుల్ చెప్పాడని డ్యాన్స్ చేయొద్దు.. సీఎం రేవంత్‌రెడ్డికి రాజా సింగ్ కౌంటర్!
Advertisement

Raja Singh: స్వేచ్ఛ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ సిజేపీ ఆందోళనలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యారంగంలో లోపాలు, సమస్యలు ఉంటే వాటిపై నిరసన తెలపడంలో ఎలాంటి తప్పులేదని, కానీ విద్యార్థుల పేరును ఒక సాకుగా వాడుకుంటూ అసలు ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

జంతర్ మంతర్ నిరసనలపై ప్రశ్నల వర్షం

Advertisement

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల తీరుపై రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సమస్యల పేరుతో అక్కడ ఉగ్రవాద అనుకూల నినాదాలు ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని, సీతారాములను ఎందుకు దూషిస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

ప్రధాని నరేంద్ర మోడీపై దాడికి కుట్ర..?

Advertisement

ఈ నిరసనల్లో ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ అంశాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై దాడికి కుట్ర పన్నుతూ, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఈ ధర్నాలు విద్యార్థుల భవిష్యత్తు కోసమా లేక హిందువులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారా అని సందేహం వ్యక్తం చేశారు. అక్కడే అల్లా గురించిన పాటలు పాడుతూ, పోలీసులు , ఆర్మీ సిబ్బందిపై కూడా దాడులకు తెగబడ్డారని ఫైర్ అయ్యారు.

తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై విమర్శలు

ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కూడా రాజా సింగ్ తప్పుపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు, మహిళలు అనేక కష్టాలు పడుతున్నారని, ప్రజలు తీవ్ర బాధల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణలో అసలు విద్యా వ్యవస్థ సరిగ్గా ఉందా అని నిలదీశారు.

పాలనను గాలికి వదిలేసి తెలంగాణను సర్వనాశనం చేశారని తీవ్రంగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాజకీయ నాటకాలు మాని, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలని హితవు పలికారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన మాటలకు డ్యాన్స్ చేయడం మానుకోవాలని రాజా సింగ్ చురకలు అంటించారు.

Also Read: సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.. పలాసలో రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు!

Related News

హైదరాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్… ఇకపై నీళ్ల కష్టాలకు శాశ్వత చెక్!

సింగరేణికోసం తెలంగాణ సర్కార్ బిగ్ ప్లాన్.. ఎర్త్ మినరల్స్ మైనింగ్‌లోకి ఎంట్రీ!

NEET Leak: బిఎఫ్ ఆర్డర్లు, బిర్యానీలు.. ఢిల్లీ నిరసనలు రాంచందర్ రావు షాకింగ్ కామెంట్స్!

స్కూల్ విద్యార్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

Minor Missing: భద్రాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన.. యువకుడిపై పోక్సో కేసు నమోదు!

10వ అంతస్తు నుంచి దూకి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్!

అనారోగ్యంగా ఉన్నా వదలరా.. టెక్ మహీంద్రా కంపెనీ వేధింపులకు రోడ్డెక్కిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని!

Big Stories

Advertisement
×