E-Paper
Advertisement

Pawan Kalyan wife Anna: తిరుమలలో పవన్ కల్యాణ్ భార్య.. శ్రీవారికి మొక్కు, డిక్లరేషన్‌పై సంతకాలు

Pawan Kalyan wife Anna: తిరుమలలో పవన్ కల్యాణ్ భార్య..  శ్రీవారికి మొక్కు, డిక్లరేషన్‌పై సంతకాలు
Advertisement

Pawan Kalyan wife Anna: ఏపీ డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమలకు వెళ్లారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే అక్కడి నుంచి ప్రత్యేక కారులో నేరుగా తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు అన్నా లెజినోవా. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించు కుంటారు.

డిప్యూటీ సీఎం పవన్‌‌కళ్యాణ్‌ కొడుకు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్నిప్రమాదానికి గురయ్యాడు. గాయాలతో బాబు బయటపడ్డాడు. ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు పవన్ కల్యాణ్ దంపతులు.  సాయంత్రం హైదరాబాద్ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు అన్నా లెజినోవా. ఆదివారం రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. శ్రీవారి దర్శనానికి ఆమె ఒక్కరే వచ్చారు.

Advertisement

కొడుకు మాత్రం హైదరాబాద్‌లో తండ్రి వద్ద ఉన్నారు. మార్క్ శంకర్‌ ప్రమాదం నుంచి బయటపడటంతో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోనున్నారు. సింగపూర్ ఘటన జరిగిన నేపథ్యంలో తన కొడుకు ప్రాణాలతో బయటపడాలని కోరుకున్నారట.

ఎలాంటి అపాయం జరగకుండా ఉంటే తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కకున్నారట. శ్రీవారు కరుణించడంతో ఆమె మొక్కు తీర్చుకుంటున్నారు. పవన్‌ భార్య అన్నా స్వతహాగా క్రిస్టియన్‌. కొడుకు ప్రాణాల కోసం తన మతాన్ని పక్కన పెట్టి తిరుమల వెంకటేశ్వరస్వామికి దర్శించుకోవడానికి రావడం విశేషం.

Advertisement

ALSO READ: రాజకీయాల్లోకి వస్తున్నా- మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటన

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×