BigTV English
Advertisement

PDS Rice Missing Case: చిక్కుల్లో పేర్నినాని.. వెంటాడుతున్న రేషన్ బియ్యం.. ఈసారి ఆయన వంతు

PDS Rice Missing Case: చిక్కుల్లో పేర్నినాని.. వెంటాడుతున్న రేషన్ బియ్యం.. ఈసారి ఆయన వంతు

PDS Rice Missing Case: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప్లాన్ బూమరాంగ్ అయ్యిందా? ఆయన ప్లాన్ బెడిసి కొట్టిందా? ముఖ్యమంత్రి-మంత్రుల మధ్య చిచ్చు పెట్టాలని భావించి బుక్కయ్యారా? ఇప్పుడు ఆయన అడ్డంగా ఇరుక్కుపోయారా? రేపో మాపో ఆయనను పోలీసులు విచారించనున్నారా? అవుననే సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.


రేషన్ బియ్యం వ్యవహారం వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఆ పార్టీలో మాటల మాంత్రికుడి‌గా పేరుపొందిన మాజీ మంత్రి పేర్నినాని చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆయనను ఏ-6గా చేరుస్తూ మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని ఆదేశాల మేరకు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారట.

కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌కు పేర్నినాని ప్లాన్ చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.


ఈ కేసులో ఇప్పటికే నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకి తరలించారు. ఇందులో ఏ-1గా పేర్నినాని భార్య జయసుధ పేర్కొన్నారు. ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ALSO READ: జగన్‌ని ఆటాడుటున్న కూటమి సర్కార్.. ఓ వైపు సీఎం, మరోవైపు డిప్యూటీ సీఎం

ఇదిలావుండగా రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో కీలక అప్‌డేట్. కాకినాడ పోర్టు బియ్యం బోకర్ల నుంచి రూ. 94 లక్షలు A-2గా ఉన్న మానస తేజ బ్యాంక్ ఖాతాకు వచ్చినట్టు గుర్తించారట. మానస తేజ అకౌంట్‌ నుంచి పేర్నినాని సతీమణి అకౌంట్‌కు భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్టు సమాచారం. దీనివెనుక గుడ్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని గతరాత్రి చీరాలలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

వైసీపీ రూలింగ్‌లో ట్రాన్స్‌పోర్టు శాఖ మంత్రిగా వ్యవహరించారు పేర్ని నాని. ఆ సమయంలో భార్య జయసుధ పేరిట గోదాంను నిర్మించారు. ఆ తర్వాత పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఆ శాఖ అధికారులు గోదాంను తనిఖీలు చేశారు. లెక్కలకు, బియ్యం నిల్వల్లో వ్యత్యాసం కనిపించింది. పెద్ద ఎత్తున పీడీఎస్ రైస్ మాయం అయినట్టు గుర్తించిన విషయం తెల్సిందే.

 

 

Related News

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Big Stories

×