E-Paper
Advertisement

Peddireddy On Chandrababu: సీఎం చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్.. ప్రజల్ని మోసం చేశారంటూ రుసరుస

Peddireddy On Chandrababu: సీఎం చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్.. ప్రజల్ని మోసం చేశారంటూ రుసరుస
Advertisement

Peddireddy On Chandrababu: చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అప్పుడు సూపర్ సిక్స్ అన్నారని, ఇప్పుడు సాధ్యం కాదని చెబుతున్నారని మండిపడ్డారు.  సూపర్ సిక్స్ లేదని చివరకు గుండు సున్నా మిగిలిందన్నారు.

శ్రీలంక మాదిరిగా ఏపీ తయారైపోయిందని ఆనాడు అన్నారని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వంత పాడారన్నారు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చానని అంటారని తెలిపారు.

Advertisement

చెప్పింది చేసే నాయకుడు జగన్ అని, ఆనాడు వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తే పప్పు బెల్లాలని అన్నారని గుర్తు చేశారు. మోసం చేసిన ఇలాంటి నేతలు రాజకీయాల్లో కొనసాగించవచ్చా అంటూ మండిపడ్డారు.  ప్రజల మనోభావాలపై రాళ్ళు వేశారని, కేవలం 7 నెలల్లో 1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చారని వ్యాఖ్యానించారు.

ఆ సొమ్ము ఏ సంక్షేమానికి ఎంత ఇచ్చారని ప్రశ్నించారు పెద్దిరెడ్డి. రెండేళ్లు కొవిడ్ ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమాన్ని అందించామని వివరించారు. ఆరోగ్య శ్రీతో పాటు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తే నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడితే జగన్ విధ్వంసం చేశారని అంటున్నారని ఆరోపించారు. పేదలను ఆదుకోవడం విధ్వంసమా? అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం నిజం కాదా అంటూ రుసరుసలాడారు.

Advertisement

ALSO READ:  ఏపీలో వాట్సాప్ పాలన.. తొలుత 161 సేవలు, ఆ తర్వాత

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×