E-Paper
Advertisement

ఆర్టీసీని నడపడం చేతకాకపోతే మాకివ్వండి.. కూటమికి పేర్ని నాని సవాల్!

ఆర్టీసీని నడపడం చేతకాకపోతే మాకివ్వండి.. కూటమికి పేర్ని నాని సవాల్!
Advertisement

Perni Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రెండేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో సీఎం కాకపోయి ఉంటే, చంద్రబాబు అప్పుడే ఆర్టీసీని అమ్మేసేవారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ అదే బాటలో ఉచిత బస్సు ప్రయాణాన్ని సాకుగా చూపిస్తూ ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినప్పుడు, దానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం ఆర్టీసీకి ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

పేర్ని నాని సవాల్

Advertisement

ఆర్టీసీని నడపడం చేతకాకపోతే వైసీపీకి అప్పగించాలని, తాము సమర్థవంతంగా నడిపి చూపిస్తామని సవాల్ విసిరారు. గత జగన్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకుంటే, నేడు చంద్రబాబు వారిని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం ఈ-బస్ సేవా కింద తెస్తున్న బస్సుల నిర్వహణ ఖర్చులపై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, కిలోమీటరుకు అయ్యే అసలు వ్యయాన్ని దాచిపెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ధనిక రాష్ట్రం చేస్తానంటూ ప్రగల్భాలు పలికారని, కానీ 24 నెలల్లోనే రాష్ట్రాన్ని నేరాలు, నిరుద్యోగంలో దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్లారని ఆరోపించారు. రాష్ట్ర సంపద సృష్టి అంతా కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అనే ‘త్రిమూర్తుల’ సొంత మనుషులకు, బ్రోకర్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.

పవన్ వ్యాఖ్యలకు పేర్ని కౌంటర్

Advertisement

ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ గెలిచిన 11 సీట్లపై సెటైర్లు వేసే పవన్, గతంలో 175 స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఇంకా తాను ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని, అధికారంలోకి వచ్చినా జనసేన కార్యకర్తలకు దక్కింది తన్నులు, కేసులు మాత్రమేనని అన్నారు. బందరులో జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేస్తుంటే స్థానిక మంత్రిని ప్రశ్నించే ధైర్యం కూడా పవన్‌కు లేదని విమర్శించారు. 100 శాతం స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్న పవన్ గెలిపించిన ఎమ్మెల్యేలలో ఒక్కడైనా జనసేన జెండా మోసిన వాడు ఉన్నాడా అని నిలదీశారు. రాష్ట్రంలో అబ్బాయి దోచుకుంటుంటే, డాడీ విదేశాల్లో దాస్తున్నారని.. రాబోయే మూడేళ్లు రాష్ట్రాన్ని పాలించే అర్హత చంద్రబాబుకు లేదని, వెంటనే ఆయన తప్పుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Also Read:మండుతున్న పెట్రో ధరలు.. ఈ 5 బైక్‌ లు మీ ఖర్చు తగ్గించేస్తాయి!

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×