BigTV English

Padagaya Pithapuram Temple: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం..హోమం జరుగుతుండగానే..

Padagaya Pithapuram Temple: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం..హోమం జరుగుతుండగానే..

Pithapuram: దక్షిణ కాశీగా విరజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం.. పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రక్క హోమం జరుగుతుండగానే.. రశీదు పుస్తకాలను బస్తాలలో తీసుకొచ్చి హోమగుండంలో పడేసి కాల్చడం పట్ల.. భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతే కాకుండా రశీదు పుస్తకాలు దహనం చేయడం వెనుక.. ఆలయ సిబ్బంది తప్పిదాలు బూడిద చేయడమేననే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.


హోమ ద్రవ్యాలు మాత్రమే వేసే పవిత్ర హోమగుండంలో.. రశీదు కాగితాలు వేయడం ఘోరమైన అపచారమని అంటున్నారు. ఆలయ ప్రతిష్టతను అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఆలయ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం శోచనీయమని వాపోతున్నారు.

Also Read: ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఆ భయంతో జగన్ డుమ్మా


మరోవైపు పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని.. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే తరుణంలో.. ఆలయంలో కనీస సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. కోనేరులో స్నానమాచరించిన మహిళా భక్తులకు బట్టలు మార్చుకునేందుకు కూడా.. సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు.

 

Tags

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×