E-Paper
Advertisement

PM Modi Vizag Tour: నవశకానికి ‘నమో’దయం – విశాఖలో మోదీ పర్యటన

PM Modi Vizag Tour: నవశకానికి ‘నమో’దయం – విశాఖలో మోదీ పర్యటన
Advertisement

PM Modi Vizag Tour: నేడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రెండు కోట్లకు పైనే విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను మరో ఎత్తుకు చేర్చుతూ రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ విలువే 1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5వేల కోట్లు. వీటితోపాటు మరో 10కిపైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే.. కొత్తగా నిర్మించిన, విస్తరించిన ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.

Advertisement

విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా సభాప్రాంగణం వద్దకు ప్రధాని భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో 1200 ఎకరాల్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చూస్తారు. కోటీ 85 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. నక్కపల్లిలో 1,877 కోట్లతో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు. తిరుపతి జిల్లా కృష్ణపట్నం వద్ద 2,139 కోట్లతో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. పది జాతీయ రహదారులు, ఏడు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

Also Read: పీఏ గుట్టు విప్పేశాడా? ఎందుకు అవినాష్ కంగారు పడుతున్నారు?

Advertisement

ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని మోదీ విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటల నుంచి 5.30 గంటల వరకు వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్‌ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు మేర రోడ్డు షోలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 నుంచి 6.45 వరకూ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సభలో మాట్లాడతారు. సాయంత్రం 6.50 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుని 7.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరి వెళతారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×