BigTV English

Pawan Kalyan : వారాహికి గ్రీన్ సిగ్నల్.. పోలీసుల షరతులు ఇవే..!

Pawan Kalyan : వారాహికి గ్రీన్ సిగ్నల్.. పోలీసుల షరతులు ఇవే..!


Pawan Kalyan varahi tour updates(Latest telugu news in AP): జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి యాత్రకు లైన్‌ క్లియర్ అయింది. పోలీసుల తరఫు నుంచి వారాహి యాత్రకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు . డీఎస్పీలు జనసేన నేతలకు ఎక్కడికక్కడ టచ్‌లోనే ఉన్నారని తెలిపారు. పవన్ పర్యటనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. భద్రత కారణాల దృష్ట్యా తాము కేవలం మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామని వివరణ ఇచ్చారు. జన కార్యకర్తలు ఎలాంటి హడావుడి చేయకుండా, సజావుగా యాత్ర జరుపుకోవాలని సూచించారు. వారాహి యాత్రకు లైన్ క్లియర్ అవ్వడంతో జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన వారాహి యాత్రకి అనుమతులు తీసుకున్నామన్నారు జనసేన నేత కందుల దుర్గేష్‌. పోలీసు సానుకూలంగా స్పందించి, యాత్ర నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. యాత్ర సజావుగా సాగేందుకు జనసైనికులు సహకరించాలని కోరారు. క్రేనుల ద్వారా భారీ పూలమాల వేసే కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించారు. భద్రత దృష్ట్యా రాష్ట్ర, జిల్లా స్థాయి వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

మరోవైపు మంగళవారం సాయంత్రానికి జనసేనాని అన్నవరం చేరుకుంటారు. బుధవారం ఉదయం 9 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు. అన్నవరం వీరవెంకట సత్యనారయణస్వామిని దర్శించుకుంటారు. కత్తిపూడిలో తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు.

Related News

AP GST Collections: ప‌న్నుల రాబ‌డిలో ప‌రుగులు తీస్తున్న ఏపీ.. సెప్టెంబ‌ర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వ‌సూళ్లు

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Big Stories

×