E-Paper
Advertisement

AP Politics: బీజేపీలోకి పోతుల సునీత.. చీరాల టికెట్‌పై కన్ను, తెర వెనుక జగన్?

AP Politics: బీజేపీలోకి పోతుల సునీత.. చీరాల టికెట్‌పై కన్ను, తెర వెనుక జగన్?

AP Politics: ఏపీలో నేతల వలసలు కంటిన్యూ అవుతున్నాయా? విపక్ష వైసీపీ నుంచి నేతలు వలస బాటపడుతున్నారా? వైసీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత అడుగులు ఎటు వైపు? బీజేపీ వైపు వెళ్తున్నారా? జేడీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయి కండువా కప్పుకోనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పుంజుకోవాలని భావిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి చాలామంది నేతలు దూరంగా ఉన్నారు. ఇక ఆ పార్టీలో భవిష్యత్ ఉందని నిర్ణయించుకున్న కొందరు నేతలు ఆ పార్టీకి రాం రాం చెప్పేశారు. ఇంకొందరు సిద్ధమవుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన పోతుల సునీత, ఇప్పుడు బీజేపీ వైపు వెళ్లారు.

ఆదివారం విశాఖలో జరగనున్న సభలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో సునీత బీజేపీ కండువాను కప్పుకోనున్నారు. బీజేపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత  ఆమె జాయిన్ అవుతున్నట్లు చెబుతున్నారు ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు.  వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే పోతుల సునీత ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ సీటు రాజీనామా వ్యవహారం ఛైర్మన్ మోషేన్‌రాజు వద్ద పెండింగ్‌లో ఉంది. ఆయన ఇంకా ఆమోదించాల్సివుంది. ఈ క్రమంలో ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు చెబుతున్నారు.

ALSO READ: తురకపాలెం సాయిల్ టెస్టింగ్ లో సంచలన నిజాలు

2017లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సునీత. 2019లో చీరాల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. ఆమెకు టీడీపీ టికెట్‌ దక్కలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సునీత. వైసీపీ అధికారంలో కోల్పోగానే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

చీరాల నుంచి టీడీపీ, జనసేన నుంచి బలమైన నాయకులు ఉండడంతో బీజేపీ అయితే బెటరని భావించి జాయిన్ అయినట్టు చెబుతున్నారు. ఆమె బీజేపీలోకి వెళ్లడం వెనుక జగన్ ఉన్నారనే వాదన సైతం లేకపోలేదు. జగన్ సూచనల మేరకు ఆమె వెళ్తున్నారని అంటున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పేసిన తర్వాత ఆ పార్టీపై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు.  మొత్తానికి పోతుల సునీత గురించి రానున్న రోజుల్లో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×