E-Paper
Advertisement

Wife Attacks Woman: నా మొగుడే కావాలా!! న‌డిరోడ్డుపై స్తంభానికి క‌ట్టేసి.. భ‌ర్త ల‌వ‌ర్‌ని పొట్టు పొట్టు

Wife Attacks Woman: నా మొగుడే కావాలా!! న‌డిరోడ్డుపై స్తంభానికి క‌ట్టేసి.. భ‌ర్త ల‌వ‌ర్‌ని పొట్టు పొట్టు

Wife Attacks Woman: ఈ రోజుల్లో మానవ సంబంధాలు చాలావరకు వక్రమార్గంలో నడుస్తున్నాయి. పెళ్లై కుటుంబాలున్నవారు కూడా తాత్కాలిక సుఖాల కోసం అక్రమ సంబంధాల వెంట పరుగులు పెడుతున్నారు. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం.. ఎవరితో వ్యవహారం నడుపుతున్నామనేది కూడా గాలికి వదిలేసి వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. తాజాగా తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. నడిరోడ్డుపై యువతిని చితకబాదింది ఓ భార్య. ఈ ఘటన  అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగింది.

ఘటన వివరాలు

సమాచారం ప్రకారం, శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అప్పటికే వివాహం జరిగింది. అతని భార్యకు కొంతకాలంగా తన భర్త ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడటం, బయట ఎక్కువ సేపు గడపటం వంటి కారణాలతో అనుమానం పెరిగింది. ఆ అనుమానం చివరికి ఒక యువతితో అతని అక్రమ సంబంధం ఉన్నట్టుగా బయటపడింది.

తన భర్తను పలు మార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో.. భార్య నేరుగా ఆ యువతిని కలిసింది. నా భర్తతో సంబంధం పెట్టుకోవద్దు అని పలుమార్లు చెప్పినప్పటికీ.. యువతి వినకపోవడంతో చివరికి ఆగ్రహానికి లోనై నిన్న రాత్రి నడిరోడ్డుపైనే ఆమెను చితకబాదింది.

ప్రజల స్పందన

ఘటన చోటుచేసుకున్న సమయంలో.. అక్కడే ఉన్న చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. కానీ భార్య ఆగ్రహం చల్లారకపోవడంతో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. స్థానికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కొద్దిసేపటికే వైరల్ గా మారింది.

పోలీసుల దృష్టి

వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదు. ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు.

సామాజిక సందేశం

ఇలాంటి సంఘటనలు కేవలం వ్యక్తులకే కాకుండా.. కుటుంబాల భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయి. పిల్లలపై, పెద్దలపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు కూలంకషంగా మాట్లాడుకోవడం, అవసరమైతే న్యాయ సలహా తీసుకోవడం అత్యంత అవసరం.

Also Read: మేథా స్కూల్లో డ్రగ్స్ కలకలం.. ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరు అరెస్ట్,వెనుక బడా నేతలు?

నర్సీపట్నంలో జరిగిన ఈ ఘటన మళ్లీ ఒకసారి కుటుంబ బంధాలలో నమ్మకం, గౌరవం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. వ్యక్తిగత వివాదాలు బహిరంగ దాడులకు దారి తీయకూడదు. సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవడం ద్వారానే కుటుంబాలు, సమాజం సుస్థిరంగా ఉంటాయి.

Related News

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

Big Stories

×