E-Paper
Advertisement

CM Chandrababu: అంబాసిడర్ కారుతో సీఎం చంద్రబాబుకు అనుబంధం.. పాత స్నేహితుడంటూ పోస్ట్

CM Chandrababu: అంబాసిడర్ కారుతో సీఎం చంద్రబాబుకు అనుబంధం.. పాత స్నేహితుడంటూ పోస్ట్
Advertisement

CM Chandrababu: మన జీవితంలో మొదటిసారి కొనుగోలు చేసిన వస్తువులను ఎప్పటికీ మర్చిపోం. మొదటి బైక్, ఫోన్, కారు.. ఇలా ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన వస్తువులను అపురూపంగా చూసుకుంటాం. ఆ వస్తువులు పాతవైపోయినా, పనిచేయకపోయినా, వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. సీఎం చంద్రబాబుకు కూడా ఒక వాహనాన్ని అలాగే భద్రపరుచుకున్నారు. ఆ అపురూప జ్ఞాపకాన్ని సీఎం చంద్రబాబు మరోసారి గుర్తు చేసుకున్నారు.

పాత అంబాసిడర్ తో సీఎం చంద్రబాబు

మూడు దశాబ్దాల క్రితం సీఎం చంద్రబాబు ఉపయోగించిన పాత 393 నెంబర్ అంబాసిడర్ కారు తాజాగా వైరల్‌గా అవుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో అంబాసిడర్ కారును పరిశీలించిన సీఎం చంద్రబాబు, ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన పర్యటనల స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు 393 నెంబర్ అంబాసిడర్ కారుతో విస్తృతంగా పర్యటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కారును అపురూపంగా భద్రపరిచారు. ఈ కారును చూసిన చంద్రబాబు పాత స్మృతులను గుర్తుచేసుకున్నారు. అంబాసిడర్ తో ఉన్న ఫొటోలను సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్టు చేశారు. సీఎం చంద్రబాబు తన సొంత వాహనమైన పాత అంబాసిడర్‌ను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.

Advertisement

Also Read: APSRTC EHS Scheme: ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Advertisement

ఏపీ 09 జీ 393 నెంబరుతో ఉన్న ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు సొంత వాహనం. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్న కారును ఇకపై అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు. ప్రస్తుతం భద్రతాపరంగా అధునాతన వాహనాలను వినియోగిస్తున్న చంద్రబాబు.. పాత అంబాసిడర్ కారును గుర్తుచేసుకున్నారు.

 

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×