E-Paper
Advertisement

Prakash Raj: పెట్టిన పంగనామాలు చాలు ఇక… పాలనపై దృష్టి పెట్టండి: ప్రకాష్ రాజ్

Prakash Raj: పెట్టిన పంగనామాలు చాలు ఇక… పాలనపై దృష్టి పెట్టండి: ప్రకాష్ రాజ్
Advertisement

Prakash Raj: ఎవ్వరు వదిలినా నేను వదలా బొమ్మాళీ.. నేను వదలనంటే వదలా.. అనే రీతిలోనే ఉంది నటుడు ప్రకాష్ రాజ్ తీరు. ఏపీ తిరుమల లడ్డు వివాదంపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఇంకా వార్ కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందంటూ సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం పవన్ సైతం ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు. అంతేకాదు… మహా ప్రసాదం కల్తీ పాపం వైసీపీదేనని ఆరోపిస్తూ.. తన ట్విట్టర్ వేదికగా సైతం వైసీపీపై విమర్శలు సాగించారు. అయితే ఈ వివాదం సాగుతున్న సమయంలోనే ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యారు. ఇక అంతే ఎవ్వరు ఆపినా.. నేను ఆగేదేలేదన్నట్లు ఉంది ఆయన వ్యవహారం. తాజాగా ఓ ట్వీట్ చేసి పరోక్షంగా పవన్ కు సవాల్ విసిరినట్లయింది.

Advertisement

లడ్డు వివాదం సాగుతున్న సమయంలో.. తొలిసారిగా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. పవన్ గారూ.. అధికారంలో ఉంది మీరే. జరిగిన కల్తీపై విచారణ సాగించండి.. అంతేగానీ సనాతన ధర్మం అంటూ ఎందుకు లేనిపోనీ వివాదాలు తీసుకు వస్తారంటూ సలహా ఇచ్చారు. అలాగే మంచు విష్ణు సైతం ప్రకాష్ రాజ్ పై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అలాగే పవన్ కూడా అదే రీతిలో స్పందించగా… ప్రకాష్ రాజ్ మాత్రం తాను విదేశాలలో ఉన్నట్లు, వచ్చాక మాట్లాడుతాను అంటూ వీడియో సైతం విడుదల చేశారు. ఆ వీడియో విడుదల చేశాక ఇక వారిద్దరి మధ్య ట్వీట్ వార్ ముగిసింది అనుకున్నారు అందరూ. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం తాను తగ్గేదెలే అన్నట్లు.. జస్ట్ ఆస్కింగ్ పేరిట రోజూ ట్వీట్ ల వర్షాన్ని కురిపిస్తున్నారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఇటీవల ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై కొంత ఘాటుగానే స్పందించారు.

Also Read: Sanatahana Dharma : సనాతన ధర్మంపై ఆ ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల మధ్య తేడా ఇదే

Advertisement

తాజాగా లడ్డు వివాదం సుప్రీంకోర్టుకు చేరగా.. కొంత కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైందని చెప్పవచ్చు. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు, దేవుడిని రాజకీయం చేయవద్దు అంటూ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనితో కూటమిపై సోషల్ మీడియా వేదికగా పలువురు ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయంపై ప్రకాష్ రాజ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే.. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ? ఇక చాలు ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి… జస్ట్ ఆస్కింగ్ అని ఉంది. అంటే పరోక్షంగా ఈ మాటలు పవన్ కు చెప్పారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొత్త భక్తుడు అంటే పవన్ అని, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. ఇక ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడాలని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దన్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఎవ్వరు వదిలినా.. నేను వదలను అన్న రీతిలో ప్రకాష్ రాజ్ ట్వీట్ ల వర్షం కురిపిస్తుండగా.. ఇక ఈ విషయంపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×