BigTV English
Advertisement

PM Modi: ‘ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ఐదేళ్లుగా అభివృద్ది శూన్యం’.. ప్రధాని మోదీ

PM Modi: ‘ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ఐదేళ్లుగా అభివృద్ది శూన్యం’.. ప్రధాని మోదీ

Prime Minister Modi: ఏపీలో ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అభివృద్ధి అనేది లేకుండా పోయిందని ప్రధాని మోదీ అన్నారు. యువతకు ఉద్యోగాలు లేకుండా చేయడమే కాకుండా.. రైతులను కూడా వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. వైసీపీ శాండ్ మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో ఎన్డీఏ ప్రజాగళం సభలో ప్రధాని మోదీ, టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పాల్గొన్నారు.


‘వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఏపీలో మాఫియాకు ఎన్డీఏ ప్రభుత్వం పక్కాగా ట్రీట్ మెంట్ ఇస్తుంది. ఏపీ ప్రజలు వైసీపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తోంది. వైసీపీ మంత్రులు గూండాగిరి చేస్తున్నారు. ఇక్కడ రౌడీ రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది.

ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. రైతులు ఆందోళనలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కు సహకరించలేదు. ఇంటింటికీ పైపులైన్ల ద్వారా నీళ్లు అందించాలనేది మా లక్ష్యం. ఏపీలో మార్పు రావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. పేదల వికాసం కాదు.. మాఫియా వికాసం కేసం. వైసీపీ ప్రభుత్వం పనిచేసింది’ అని ప్రధాని మోదీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.


Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×