E-Paper
Advertisement

Nominations: రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ.. అత్యధికంగా అక్కడే?

Nominations: రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ.. అత్యధికంగా అక్కడే?
Advertisement

Nominations: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 4,210 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 లోక్ సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

25 పార్లమెంట్ స్థానాలకు గాను 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. అయితే ఓకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను ఈసీ ఉపసంహరించింది. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల పార్లమెంట్ కు 36 నామినేషన్లు రాగా, అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం ఆమోదించినట్లు వెల్లడించింది.

అసెంబ్లీ స్థానాలకు గాను తిరుపతి నుంచి అత్యధికంగా 48 నామినేషన్లు దాఖలవ్వగా.. చోడవరం స్థానానికి అత్యల్పంగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో త్వరలోనే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆర్వోలు గుర్తులను కేటాయించనున్నారు.

Tags

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×