Big Stories

Purandeswari Comments on Jagan: అందుకోసమే త్రివేణి సంగమం.. అజెండా అదే: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి

Purandeswari says Kutami target on Jagan govt
Purandeswari says Kutami target on Jagan govt

Purandeswari Comments on YS Jagan: జగన్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడమే కూటమి లక్ష్యమన్నారు. మూడు పార్టీల జెండాలు వేరైనా, అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. మంగళవారం విజయవాడలో పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, తమ కూటమిని త్రివేణి సంగమంగా వర్ణించారు.

- Advertisement -

కూటమిలోని ప్రతి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కేడర్‌కు పిలుపునిచ్చారు పురందేశ్వరి. సీఎం జగన్‌ను గద్దెదించడానికి మూడుపార్టీలు కలవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఏపీలో రామరాజ్యం సాకారమవుతుందని మనసులోని మాటను బయటపెట్టారు. ఈ క్రమంలో టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందన్నారు.

- Advertisement -

పనిలోపనిగా జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు పురందేశ్వరి. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తన ఆధీనంలో పెట్టుకుందని, ఈ క్రమంలో దొంగ ఓటర్లను చేర్పించిందని దుయ్యబట్టారు. గడిచిన ఐదేళ్లలో ఏపీ అప్పులు తప్ప ఏమీ మిగల్లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పుడు చేసిందని ఆరోపించారు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా అని ఆ పార్టీకి చెందిన ఓ నేత ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం జగన్ మాటల్లో తప్ప చేతల్లో ఏమీ చేయలేదన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News