BigTV English
Advertisement

Chandragiri Fake Votes : ఓటర్ల నమోదు అక్రమాలపై విచారణ.. బీఎల్ఓలకు షాకాజ్ నోటీసులు జారీ..

Chandragiri Fake Votes : ఓటర్ల నమోదు అక్రమాలపై విచారణ.. బీఎల్ఓలకు షాకాజ్ నోటీసులు జారీ..

Chandragiri Fake Votes : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల దందాపై తెలుగుదేశం పోరాటం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఓట్లు నమోదు చెయ్యడంపై విచారణ జరుగుతోంది. కొంతమంది బీఎల్‌ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల వ్యక్తుల ముఖాలు సరిగా లేకుండానే వారిని ఓటర్ల జాబితాలో చేర్చడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి 49,956 వేల ఓట్లను చేర్పించడానికి ఫారం సిక్స్ దరఖాస్తులు సమర్పించారని టీడీపీ జాతీయ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ నిశాంత్ రెడ్డి దీనిపై విచారణ చేశారు.


తిరుపతి రూరల్ మండలంలోని దాదాపు 24 వేల ఓట్లర్ల ముఖాలు సరిగా కనిపించకుండా ఉన్న వారి ఓట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు కూడా సరిగా లేవని తెలుస్తొంది. దీంతో సంబంధిత బీఎల్ఓ లపై విచారణ ప్రారంభించారు. స్థానికేతరుల ద్వారా వారు ఫారం6 తీసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద నియోజకవర్గంలో ఫారం7 ద్వారా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, జనసేనకు సంబంధించిన ఓట్లను 50 వేలకు పైగా తొలగించారంటూ ఫిర్యాదు అందింది. దీంతోపాటు ఫారం సిక్స్ ద్వారా 50వేల ఓట్లను అదనంగా చేర్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అటు మండల ఎన్నికల అధికారి నుంచి జాతీయ ఎన్నికల కమిషనర్ వరకు టిడిపి చంద్రగిరి ఇంచార్జి పులవర్తి నానితోపాటు జనసేన ఇంచార్జ్ మనోహర్ కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×