E-Paper
Advertisement

Ananthapur News: కలెక్టరేట్‌లో రెవిన్యూ అధికారి.. ఆన్‌‌లైన్‌లో జాకీ-ఆసుతో బిజీ

Ananthapur News: కలెక్టరేట్‌లో రెవిన్యూ అధికారి.. ఆన్‌‌లైన్‌లో జాకీ-ఆసుతో బిజీ
Advertisement

Ananthapur News: నేను మారాను.. మీరు మారండి.. లేదంటే 1996 సీఎంను చూస్తారని పదే పదే అధికారులను హెచ్చరిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయినా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడలేదు. అందుకు ఎగ్జాంఫుల్ అనంతపురం జిల్లా రెవిన్యూ అధికారి. ఓ వైపు కమిషన్ ఛైర్మన్ మీటింగ్ జరుగుతుండగా, ఆయన మాత్రం రాణి, జాకీ, ఆసు గేమ్‌లో నిమగ్నమయ్యారు ఈ పేకాట పాపారావు.

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తోంది. జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు జిల్లా రెవిన్యూ అధికారి మలోల స్వాగతం పలికారు. ఆ తర్వాత రెవెన్యూ భవన్‌లో ఛైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు హాజరయ్యారు.

Advertisement

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం- అనుకూలం వర్గాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు అక్కడికి వచ్చారు. రెవెన్యూ భవన్ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే ఈ సమావేశం తనకు ఏమాత్రం సంబంధ లేదని భావించారాయన. కమిషన్ ఛైర్మన్‌కు కూతవేటు దూరంలో కూర్చొన్నారు.

ఇంత జరుగుతున్నా జిల్లా రెవిన్యూ అధికారి-డిఆర్ఓ మల్లాల తనకు ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. జేబులోని తన స్మార్ట్ ఫోన్ బయటకు తీసి ఆన్ చేసి హాయిగా రమ్మీ ఆడుతూ బిజి బిజీగా కనిపించారు. రాణి-జాకీ-ఆసుల ప్రపంచంలో మునిగిపోయారు. తనవైపు ఎవరైనా చూస్తున్నారా భావించి.. ఆట మధ్యలో అటు ఇటు చూడడం మొదలుపెట్టారు.

Advertisement

ALSO READ: దావోస్ వెళ్లి చేసిందా ఇదా? చంద్రబాబు టీమ్‌పై అంబటి సెటైర్లు

దీనికి సంబంధించి అధికారి వెనకున్న మరొకరు ఈ తతంగాన్ని తన ఫోన్‌లో రికార్డు చేశారు. మలోల వ్యవహారంపై విమర్శలు తీవ్రమయ్యాయి. తన కార్యాలయంలో డీఆర్వో మలోల పేకాట ఆడటమే పనిగా పెట్టుకున్నారన్నది కొందరు కలెక్టరేట్ ఉద్యోగుల మాట. ఆయనపై పైస్థాయి అధికారులు  ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరోవైపు కలెక్టర్ పక్కనే రమ్మీ ఆడిన డీఆర్ఓ మలోలపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సీరియస్ అయ్యారు. మలోలపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారుల పక్కన పెట్టుకొని రమ్మీ గేమ్ ఆడటం‌పై సీరియస్ అయ్యారు. DRO మలోలపై ఇదివరకే ఇలాంటి ఆరోపణలున్నాయి. దీంతో DRO మలోలపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశమున్నట్లు కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×