BigTV English

Road Accident: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు!

Road Accident: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు!

Road Accident in vijayanagaram two killed: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వెంటనే తోటి వాహనదారులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నుంచి విజయనగరం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.

డెంకాడ మండలం మోదవలస వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో విజయనగరానికి చెందిన మనోజ్(27), విశాఖ జిల్లా తగరపువలసకు చెందిన శ్యామ్ కుమార్(33) ఉన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇదిలా ఉండగా, అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సును సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. రామాపురం మండలంలోని మేదరపల్లి చెక్ పోస్టు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటి వైపు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. క్షతగాత్రులను కడప, రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సిమెంట్ లారీ, బస్సు రోడ్డు అడ్డంగా పడిపోయాయి. దీంతో కడప, రాయచోటి మార్గంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Also Read: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్న రామాపురం పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో వాహనాలు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×