E-Paper
Advertisement

Road Accident: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు!

Road Accident: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు!
Advertisement

Road Accident in vijayanagaram two killed: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వెంటనే తోటి వాహనదారులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నుంచి విజయనగరం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.

Advertisement

డెంకాడ మండలం మోదవలస వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో విజయనగరానికి చెందిన మనోజ్(27), విశాఖ జిల్లా తగరపువలసకు చెందిన శ్యామ్ కుమార్(33) ఉన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సును సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. రామాపురం మండలంలోని మేదరపల్లి చెక్ పోస్టు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటి వైపు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. క్షతగాత్రులను కడప, రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సిమెంట్ లారీ, బస్సు రోడ్డు అడ్డంగా పడిపోయాయి. దీంతో కడప, రాయచోటి మార్గంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Also Read: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్న రామాపురం పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో వాహనాలు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×