Disqualification of 8 MLAs in AP(AP political news): ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ.. సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల పార్టీలు మరిన వైకాపా రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై ఈ అనర్హత వేటు వేశారు. ఇరు పార్టీల నేతలు ఇచ్చిన అనర్హత పిటిషన్లను విచారించి.. న్యాయ నిపుణుల సలహాతో ఈ నిర్ణయం తీసుకునట్లు స్పీకర్ తెలిపారు. మంగళవారం ఈ నిర్ణయంపై గెజిట్ వెలువడనుంది.
వైసీపీ ఫిర్యాదుతో ఆ పార్టీలోని నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరామ్, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్లపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు.
ఇటీవల విచారణ అనంతరం.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకునట్లు స్పీకర్ వెల్లడించారు. ఫిర్యాదుల అనంతరం జనవరి 29న తొలిసారి చర్చలకు పిలిచారు. ఈ చర్చలలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అనంతరం వ్యక్తిగత విచారణకు సమయం ఇచ్చిన వారు హాజరు కాలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపారు.