BigTV English
Advertisement

Supremecourt : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే..

Supremecourt : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే..

Supremecourt : వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. గంగిరెడ్డి విడుదల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడం, కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ను ఇటీవల జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన వేసవి సెలవుల ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని, అలాగే ఆయన లొంగిపోవాలని కోరారు. ఆయన్ను జూలై 1న విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 27న ఇచ్చిన ఉత్తర్వులు 8వ వింతను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు తామెప్పుడు చూడలేదన్నారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.

గంగిరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. తాము కూడా బెయిల్‌ రద్దును సవాలు చేస్తూ ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశామని తెలిపారు. ఆ పిటిషన్ ఇంకా లిస్ట్‌ కావాల్సి ఉందన్నారు. అన్నీ కలిపి విచారించాలని కోరారు. దీంతో జస్టిస్‌ నరసింహ రెండు కేసులనూ శుక్రవారానికి వాయిదా వేశారు. తాజాగా ఆ కేసును విచారించిన ధర్మాసనం.. గంగిరెడ్డి విడుదల అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.


Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×