E-Paper
Advertisement

Software Engineer Suicide: తిరుపతిలో దారుణం, అన్న కుటుంబాన్ని చంపి, టెక్కీ సూసైడ్

Software Engineer Suicide: తిరుపతిలో దారుణం, అన్న కుటుంబాన్ని చంపి, టెక్కీ సూసైడ్
Advertisement

Software Engineer Suicide: వారిద్దరు అన్నదమ్ములు. తమ్ముడు మోహన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. డబ్బుల కు కొదవలేదు. అతడి అన్న రాజకీయ పార్టీలో పని చేస్తున్నాడు. ఏ సమస్య వచ్చినా అన్నదమ్ము లిద్దరు చర్చించుకునేవారు. అప్పటివరకు కూర్చొని మద్యం సేవించారు. అన్న బయటకు వెళ్లగానే..  తమ్ముడు, వదిన, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి పొడిచి దారుణంగా చంపేశాడు. చివరకు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసు కున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..

తిరుపతిలోని పద్మావతి నగర్‌లో ఉంటోంది టీవీ దాస్ ఫ్యామిలీ. దాసుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా రు. పెద్ద కూతురికి 13 ఏళ్లుకాగా, మరో అమ్మాయికి పదేళ్లు. వీరికి ఓ తమ్ముడు మోహన్ ఉన్నాడు. సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఐదేళ్ల కిందట మోహన్‌కు అన్నావదినలే మ్యారేజ్ చేశారు. మరి ఏమైందోగానీ మరుసటి ఏడాది దంపతులు విడిపోయారు. రీసెంట్‌గా సెకండ్ మ్యారేజ్ చేశారు.. ఆ అమ్మాయి కూడా మోహన్‌కు దూరంమైంది. దీంతో టెక్కీ మానసికంగా లోలోపల కుంగిపోయాడు.

Advertisement

సీన్ కట్ చేస్తే.. బుధవారం రాత్రి ఇంట్లో దాస్- తమ్ముడు మోహన్ మద్యం సేవించారు. ఆ మత్తులో దాస్ బయటకు వెళ్లాడు. బయట నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ, వదిన ను, ఇద్దరు ఆడపిల్లలను పదునైన కత్తితో పొడిచి చంపేశాడు సాప్ట్‌వేర్ ఇంజనీర్. వారంతా రక్తం మడుగులో పడివున్నారు. వారి మృతదేహాలను తరలించేందుకు ప్రయత్నం చేశాడు. ఇరుగుపొరుగువారు గమనించి గట్టిగా కేకలు వేయడంతో మోహన్ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

ALSO READ: ఏలూరు స్కూల్‌లో దారుణం.. తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి.. ఆ తర్వాత

Advertisement

ఈలోగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తలుపు బద్దలు కొట్టి చూడగా అప్పటికే అన్న కుటుంబం రక్తపు మడుగులో పడివుంది. మోహన్ ఉరేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మోహన్ అన్న దాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాడు. అన్న-తమ్ముడి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఫ్యామిలీ సభ్యులను హత్య చేయాలని తమ్ముడికి అన్న సలహా ఇచ్చాడా? లేక మద్యం మత్తులో అనుకోకుండా జరిగిందా? ఇలా రకరకాల ప్రశ్నలు స్థానికులను వెంటాడుతున్నాయి.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×