E-Paper
Advertisement

Vizag : గుండెపోటుతో తల్లి మృతి.. వారం రోజులైనా గుర్తించని కుమారుడు..

Vizag : గుండెపోటుతో తల్లి మృతి.. వారం రోజులైనా గుర్తించని కుమారుడు..
Advertisement
Vizag news today

Vizag news today(Local news andhra Pradesh):

ఇంట్లో కుమారుడు ఉండి కూడా తన తల్లి మృతి చెంది వారం రోజులైనా గుర్తించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ బీచ్‌రోడ్డు కురుపామ్‌ టవర్‌ రెండో అంతస్తులో ఇనగంటి శ్యామల (67) అనే వృద్ధురాలు తన కుమారుడు శరవణ్‌కుమార్‌(27)తో కలిసి నివాసముంటున్నారు. తన భర్త బాల సుబ్రహ్మణ్యం మృతి చెందడంతో ఇద్దరే ఉంటున్నారు.

జనవరి 1 నుంచి ఆ ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఆ ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. ఆ వృద్ధురాలు సోఫాలో విగతజీవురాలై కనిపించింది. ఇల్లంతా దుర్వాసన వస్తుండటంతో.. వృద్ధురాలు మరణించిందని గుర్తించారు. ఇంట్లోనే ఉన్న కుమారుడిని పోలీసులు ప్రశ్నించగా.. తన తల్లి నిద్రపోతుందని సమాధానం చెప్పాడు.

Advertisement

శ్రవణ్‌ కుమార్‌ బీటెక్‌ చదువుకున్నాడు. అతను 2018 నుంచి 2020 వరకు బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం మానేసి విశాఖలో తన తల్లితో కలిసి ఉంటున్నాడు.అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో మరో ఉద్యోగానికి వెళ్లలేదు.

శ్రవణ్‌కుమార్‌ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే తన తల్లి చనిపోయిన విషయం గుర్తించలేదని పోలీసులు భావించారు. జనవరి 1న గుండెపోటుతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. సి.ఐ. కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై సింహాచలం కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×