E-Paper
Advertisement

Crime News: దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం.. దుండగుల కోసం పోలీసుల గాలింపు

Crime News: దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం.. దుండగుల కోసం పోలీసుల గాలింపు
Advertisement

Crime News: పొట్టకూటి కోసం కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుండి వచ్చిన ఇద్దరు మహిళలపై దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో ఐదు నెలల క్రితం బళ్లారి నుండి వచ్చిన ఓ కుటుంబం నివసిస్తోంది. వీరు స్థానిక పేపర్ మిల్లులో పని చేస్తూ.. జీవన మనుగడ సాగిస్తున్నారు.

Advertisement

ఈ కుటుంబంలో ఓ వ్యక్తి స్థానిక పేపర్ మిల్లులో వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు. అయితే రోజువారి మాదిరి గానే.. రాత్రి కాగానే కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనాలపై ఐదుగురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి తండ్రి, కొడుకులను కత్తితో బెదిరించినట్లు బాధితులు తెలుపుతున్నారు. బెదిరించిన అనంతరం అత్తాకోడళ్లను పక్కకు తీసుకెళ్లి దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం దావానంలా వ్యాప్తి చెందడంతో.. స్థానికులు అసలేం జరిగింది.. ఎవరు వారు అంటూ ఆరా తీస్తున్నారు.

Also Read: TTD Files Complaint: సీఎంకే ప్రాణగండం అంటూ పోస్ట్.. టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Advertisement

లైంగిక దాడి విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, బాధితులను విచారించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి మూకుమ్మడిగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో.. పలు బృందాలుగా విడిపోయి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి సవిత కూడా స్పందించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పోలీసులు పట్టుకుంటారని మంత్రి తెలిపారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×