BigTV English
Advertisement

Crime News: దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం.. దుండగుల కోసం పోలీసుల గాలింపు

Crime News: దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం.. దుండగుల కోసం పోలీసుల గాలింపు

Crime News: పొట్టకూటి కోసం కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుండి వచ్చిన ఇద్దరు మహిళలపై దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో ఐదు నెలల క్రితం బళ్లారి నుండి వచ్చిన ఓ కుటుంబం నివసిస్తోంది. వీరు స్థానిక పేపర్ మిల్లులో పని చేస్తూ.. జీవన మనుగడ సాగిస్తున్నారు.


ఈ కుటుంబంలో ఓ వ్యక్తి స్థానిక పేపర్ మిల్లులో వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు. అయితే రోజువారి మాదిరి గానే.. రాత్రి కాగానే కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనాలపై ఐదుగురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి తండ్రి, కొడుకులను కత్తితో బెదిరించినట్లు బాధితులు తెలుపుతున్నారు. బెదిరించిన అనంతరం అత్తాకోడళ్లను పక్కకు తీసుకెళ్లి దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం దావానంలా వ్యాప్తి చెందడంతో.. స్థానికులు అసలేం జరిగింది.. ఎవరు వారు అంటూ ఆరా తీస్తున్నారు.

Also Read: TTD Files Complaint: సీఎంకే ప్రాణగండం అంటూ పోస్ట్.. టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

లైంగిక దాడి విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, బాధితులను విచారించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి మూకుమ్మడిగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో.. పలు బృందాలుగా విడిపోయి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి సవిత కూడా స్పందించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పోలీసులు పట్టుకుంటారని మంత్రి తెలిపారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×