BigTV English
Advertisement

Srisailam Temple: శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆ సేవలు రద్దు

Srisailam Temple: శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆ సేవలు రద్దు

Srisailam Temple: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నారు. 19న ధ్వజారోహణ, 20న భృంగి వాహన సేవ, 21న హంస వాహన సేవ, 22న మయూర వాహన సేవ, 23న రావణ వాహన సేవ, 24న పుష్ప పల్లకి సేవ, 25న గజ వాహన సేవ, 26న మహాశివరాత్రి, నంది వాహన సేవ, 27న రథోత్సవం, తెప్పోత్సవం, 28న యాగపూర్ణాహుతి, మార్చి ఒకటో తేదీన అశ్వవాహన సేవ, పుష్పోత్సవం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే 23వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం సాగుతుందని శ్రీశైల ఆలయ అధికారులు ప్రకటించారు.


మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో చలువ పందిర్లను ఏర్పాటు చేశారు. కాగా 19వ తేదీ నుండి మార్చి ఒకటో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు నిలిపివేశారు. ఈ ఉత్సవ రోజులలో భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుందని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని అధికారులు కోరారు.

భక్తుల సౌకర్యార్థం మూడు క్యూ లైన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శీఘ్ర దర్శనం రూ. 200 లు, అతి శీఘ్ర దర్శనంకు రూ. 500 లు భక్తులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే శివదీక్ష భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది.


బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 35 లక్షల లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఆలయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. మొత్తం 15 శాశ్వత కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలను భక్తులకు అందజేయనున్నారు. 4 రోజులపాటు అనగా 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాలను అందజేస్తారు. ఒక్కో భక్తుడికి ఒక లడ్డును ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని మీడియా సమావేశంలో అధికారులు ప్రకటించారు.

అలాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు, మొత్తం 10 బస్సులు భక్తులకు ఉచిత సేవలు అందిస్తాయన్నారు. పాతాళ గంగ వద్ద భక్తులు పుణ్యా స్నానాలు ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఆలయ సమీపంలో గంగాభవాని స్నాన ఘట్టాలలో కూడా భక్తులు స్నానాలను ఆచరించవచ్చు. అంతేకాకుండా మొత్తం 12చోట్ల భక్తులు స్నానాలు ఆచరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు నిరంతరం సేవలు అందించేందుకు అన్నదాన భవన సముదాయం వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ లో కంట్రోలింగ్ పాయింట్ ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లో 21 ఎల్ఈడి టీవీలు అందుబాటులో ఉంటాయని, అలాగే 553 స్టాటిక్ సీసీ కెమెరాలు నిరంతరం భక్తుల రద్దీని పర్యవేక్షిస్తాయని తెలిపారు.

Also Read: Fine for Drinking Water: నీటిని వృథా చేస్తున్నారా? ఏకంగా రూ. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే..

ఉత్సవాల సందర్భంగా భక్తులకు సమాచారాన్ని తెలిపేందుకు రెండువేల సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని, పాదయాత్ర ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు సూచిక బోర్డులు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు ప్రకటించారు. మొత్తం మీద శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

Related News

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Big Stories

×